పంచాయతీ కార్యదర్శి హరిశ్చంద్రా రెడ్డిసేవలు మరువలేనివి
అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి
ఘనంగా పంచాయతీ కార్యదర్శి హరిశ్చంద్రా రెడ్డి కి వీడ్కోలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఉద్యోగ రీత్యా ప్రజలతో మమేకమై పనిచేస్తే పది కాలాలు వారికి గుర్తుండిపోతామని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి డిపిఓ లు అన్నారు. మంగళవారం మండలంలోని చెల్పూర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ పదవి విరమణ పొందిన చింతలపూడి హరిశ్చంద్రా రెడ్డి, పద్మా దంపతులకు చెల్పూర్ రైతు వేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఘనంగా వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శిగా హరిశ్చంద్రా రెడ్డి, గణపురం మండలంలో సుమారు 22 సంవత్సరాల పాటు సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు. పనిచేసిన ప్రతిచోట వివాదరహితుడిగా ప్రజల మన్ననలు పొందారని అన్నారు. పాలకవర్గంలో ఎవరున్నా వివాద రహితుడిగా తన విధులు నిర్వహించడం వల్లే ఈరోజు ఆయన పదవీ విరమణ వీడ్కోలు సమావేశానికి పెద్ద సంఖ్యలో మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు సహచర ఉద్యోగులు ప్రజలు తరలివచ్చారని వారు ఈ సందర్భంగా అన్నారు. పదవి విరమణ అనంతరం ఆయన తమ కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడపాలని వారు ఆకాంక్షించారు. అనంతరం తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మండల పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది చెల్పూర్ గ్రామపంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో హరిశ్చంద్రా రెడ్డి, పద్మ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎల్ భాస్కర్,జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు ఉమ్మల్ల విజేందర్ తదితరులు పాల్గొన్నారు.