# సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య.
నర్సంపేట,నేటిధాత్రి :
ప్రపంచ కార్మిక దినోత్సవం
మే డే స్ఫూర్తితో ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య పిలుపునిచ్చారు. మే డే ను పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని 11 సెంటర్లలో సిపిఎం పార్టీ జెండాల ఆవిష్కరణల కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వరంగల్ రోడ్డు కూడలి వద్ద సిపిఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన చింతమల్ల రంగయ్య మాట్లాడుతూ చికాగో నగర పురవీధుల్లో పని గంటల తగ్గింపు కోసం జరిగిన విరోచిత పోరాటంలో కార్మికులు అసువులు బాసిన సందర్భంగా ఆనాడు కార్మికుల హక్కులకు గుర్తుగా ఎర్రజెండా వెలిసిందని ఆ పోరాటం కాలక్రమేనా ఎనిమిది గంటల పని దినాన్ని సాధించి పెట్టిందని అన్నారు. కార్మికులతో 24 గంటలు పనిచేసే దాస్య సుంకలాల నుండి కార్మికవర్గానికి విముక్తి కలిగించిన పోరాటమే మేడే అని ఆ మేడేను కార్మిక వర్గం ప్రజలందరూ కలిసి జరుపుకోవాలని వారి హక్కులకు భంగం వాటిల్లిన సందర్భంలో ఆ ప్రభుత్వాల మీద పోరాటాలు ఉద్యమాలు చేసి హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.దేశానికి స్వతంత్రం వచ్చే 76 వసంతాలు గడిసిపోతున్న కేంద్రంలో 9 సంవత్సరాల కాలంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఫ్యాక్టరీలను ప్రైవేటు వ్యక్తులకు దారా దత్తం చేస్తుందని అలాగే బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల శ్రమదోపిడి పెరిగిందని పెట్టుబడిదారీ వర్గాలకు కార్మికుల శ్రమను అదనంగా దోచిపెట్టడం కోసం కార్మిక చట్టాల సవరణతో పాటు ఎన్నో పోరాటాలతో సాధించుకున్న పని గంటల తగ్గింపును ఎనిమిది గంటల నుండి 12 గంటలకు పెంచిన ఘనత ఈ బిజెపి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ ఆర్టీసీ కార్మికుల హక్కులను ఉపాధి హామీ కూలీలను పనులు దొరకకుండా నిధుల కోతల విధిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి కూలీల హక్కులను హరించి వేస్తూ పాలన కొనసాగిస్తున్నాయని అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారికి పని భద్రత లేకుండా చేస్తుందని చెప్పారు. అలాగే వీఆర్ఏలు గ్రామపంచాయతీ కార్మికులు ఆశాలు అంగన్వాడి ఇతర రంగాల కార్మికుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పెరిగిన ధరలకు అనుగుణంగా వారి వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో విప్లవాన్ని జయప్రదం చేసుకోవడం కోసం ప్రజలందరూ ఐక్యంగా పోరాడి వారి హక్కులను కాపాడే కార్మిక వర్గానికి రాజ్యాధికారాన్ని ఇస్తే సమస్యలు పరిష్కారమవుతాయి అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
గత 4 ఈ కార్యక్రమం లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోరబోయిన కుమార స్వామి, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీద బాలకృష్ణ,కందికొండ రాజు, హన్మకొండ సంజీవ, రుద్రారపు లక్ష్మీ, శాఖ కార్యదర్శిలు ఇప్ప సతీష్,ఎండి ఫరీదా,వజ్జంతి విజయ, బిట్ర స్వప్న,కలకోటి అనిల్, జగన్నాథం కార్తీక్,, , ఉదయగిరి నాగమణి, గణిపాక ఇంద్ర, యాగలక్ష్మి, ఐటిపాముల వెంకన్న, కొండి మల్లన్న,దాసరి నరేష్, ప్రశాంత్, రజిత, చందు లక్ష్మి నారాయణ, ప్రియాంక, గోపి, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
# దుగ్గొండి మండలంలో…..
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో సిపియం అధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఈసంపెల్లి బాబు పార్టీ జెండా ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు పుచ్చకాయల కృష్ణారెడ్డి, చల్లా నరసింహ రెడ్డి, నాచినపల్లి మండల కార్యదర్శి బోళ్ళ సాంబయ్య,సీనియర్ నాయకుడు పుచ్చకాయల చంద్రారెడ్డి, తిమ్మంపేట అక్కపెల్లి సుధాకర్, అడవి రంగాపురం కోడెం రమేష్, లక్ష్మింపూర్ తాళ్ళపెల్లి రవి, రేకంపల్లి కల్వాల సుధీర్, ఇజ్జగిరి కనకమల్లు, వెంకటాపూర్ ఊరటి లింగారెడ్డి, జూలూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.