కాంగ్రెస్,బీజేపీ నుండి బి.ఆర్.యస్.లో చేరిన నాయకులు

పరకాల నేటిధాత్రి
పరకాల నియోజకవర్గంలోనిa పరకాల మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్,బీజేపీ పార్టీకి చెందిన వారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.యస్.పార్టీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత 60 ఏండ్ల కాలంలో ప్రజలు మెచ్చే సంక్షేమ పథకాలు చేయలేదని,గడిచిన 10 ఏండ్ల కాలంలో బి.ఆర్.యస్.పార్టీ , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావాలాంటిదని దానిలో ఎవరు ఉన్న మునగడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.పార్టీ లో చేరిన వారు సిలువేరు శ్రీనివాస్, మంగలపల్లి బాబు,రాజు , జంపయ్య,సిలువేరు సుధాకర్,ఉర రాకేష్ రావు, బొచ్చు సదన్ కుమార్,దొగ్గేలా సంతోష్,సిలువేరు హరీష్ , సిలువేరు వసంత,సిలువేరు శ్రీధర్,సిలువేరు కిషన్, కొత్తూరు శివాజీ,సిలువేరు శ్రీకాంత్,మామిడి బాబు , సిలివేరు సురేష్,పొల్నిని శ్రీనివాస్,ఒరుగంటి రాజేందర్ , సిలువేరు భిక్షపతి,క్యాతం రాజయ్య,ఉర శిరీష్,ముస్కె నవీన్,ముస్కె రవితేజ , సిలువేరు సమర వర్ధన్ , ముస్కె మోహన్ ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతినిధులు,మండల నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version