హన్మకొండ జిల్లా:నేటిధాత్రి
సమాజంలో సామాజిక అసమనతలపై నిరంతరం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంగము కె వి పి ఎస్ పోరాటాలు చేస్తుందని కేవీపీఎస్ హన్మకొండ జిల్లా కార్యదర్శి మంద సంపత్ అన్నారు. శుక్రవారం నడికూడ మండల కేంద్రంలో కేవీపీఎస్ 25 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్ అధ్యక్షతన, కేవీపీఎస్ నడికూడ మండల కార్యదర్శి సంఘాల సురేష్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా మంద సంపత్ మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా దళితులు ఓవైపు సామాజిక అణిచివేత, మరోవైపు ఆర్థిక దోపిడీకి గురవుతున్నరాని, అట్టడుగు పొరల్లో జీవిస్తున్న వారి జీవితాల్లో నేటికీ ఆశించిన మార్పు రాలేదన్నారు. సమాజాభివద్ధికి తమ శ్రమను ధారపోస్తున్న వారికి ప్రకతి వనరుల్లో సహజ సమాన న్యాయాన్ని పొందలేకపోతున్నారు. అవమానంతో పాటు ఆకలి, దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. ఈ కాలంలోనూ కులవివక్ష, అంటరానితనం పల్లెల్లో ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా నిరాటంకంగా కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి, నీరు, గాలి, వెలుగు సమస్త ప్రజలకు సమాన హక్కుగా ఉండనంతకాలం ఈ అసమానతలు నీడలా వెంటాడుతూనే ఉంటాయి అన్నారు. కులవివక్ష దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు, కుల దురహంకార హత్యలు రాష్ట్రంలో ఏదో మూల ప్రతిరోజు దర్శనమిస్తున్నాయి అన్నారు. విద్యా, వైద్యం, ఉపాధి దళితులకు అందని ద్రాక్షలా మారాయి. సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల వల్ల రిజర్వేషన్లు కోల్పోవడంతో ఉన్న కొద్దిపాటి అవకాశాలు చేజారుచున్నాయి అన్నారు. దళితులందరిని సంఘటితం చేయడం, విశాల ఐక్యత, పోరాడి సాధించడం అనే మౌలిక చారిత్రక అవసరంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం 1998 అక్టోబర్ 2న ఆవిర్భావించింది అన్నారు. కేవీపీఎస్ ఏర్పడే నాటికి దళితులు అనేక చీలికలు పేలికలై ఉపకులాల వారీగా సంఘాలు ఏర్పరచుకొని ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ అనుకూల, వ్యతిరేక విషయాల చుట్టూ తిప్పుతూ కొన్ని పరిమిత లక్ష్యాల కోసం కృషి చేస్తున్నాయి. కానీ కేవీపీఎస్ మాత్రం ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన వంటి శాశ్వత లక్ష్యాలను నిర్దేశించుకుని 25 సంవత్సరాలుగా పోరాడుతూనేవుంది అన్నారు. అలాగే నడికూడ గ్రామంలో కూడా నేటికి అసమానతల రూపంలో జెండా గద్దె కట్టుకోడానికి కూడా ఆటంకాలు ఎదురైయ్యాయని అన్నారు. నేటికి అసమానతలు ఉన్నాయి అనడానికి ఇదే నిదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో దుప్పటి సుమన్, దుప్పతి అనిల్, దుప్పతి కిస్టీఫెర్, రాజయ్య, అల్లూరి మోగిలి, రవి, సంఘాల ప్రసాద్, రాజు, ఏలీయా, జోసఫ్, శ్రీకాంత్, రవి, చేరాలు, సుమన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.