బీఆర్ఎస్ ఖాతాలోకి కుర్వగడ్డపల్లి గ్రామం..

> మిగతా పార్టీలు మా గ్రామంలో ప్రచారం చేయొద్దంటూ తీర్మానం..

> మా ఓట్లన్నీ బీఆర్ఎస్ కే..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

”మా ఊరిలో ఇతర పార్టీల వాళ్లు ప్రచారం చేసినా ప్రయోజనం లేదు, మా ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకే, మా మద్దతు జడ్చర్ల నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కే ” అంటూ కుర్వగడ్డపల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా
జడ్చర్ల మండలం కురువగడ్డపల్లి గ్రామస్తులంతా అభివృద్ధికి పట్టం కట్టేందుకు నడుం బిగించారు. గత 9 ఏళ్లలో తమ గ్రామంతో పాటు మండలం, నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనించిందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అర్హులకు మంచిగా అందుతున్నాయని అన్నారు. అందుకే తామంతా బిఆర్ఎస్ పార్టీకే మరోసారి మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఇతర పార్టీల వారు తమ గ్రామంలో ప్రచారం చేసిన దండగే అని మంచి చేస్తున్న ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version