తీన్మార్ మల్లన్నను ఎమ్మె ల్సీగా గెలిపించు కుందాం ఎమ్మెల్యే గండ్ర సత్యన్న

ప్రజల కోసం పోరాడేవ్యక్తి సభలో ఉండాలి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ అని వారిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోభూపాలపల్లి నుండి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు ప్రతీ ఒక్కరూ కష్టపడాలని సూచించారు. జీవో నంబర్ 46, 317 ఇతర ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ కేబినెట్ సబ్ కమిటీ వేసి పరిష్కరిస్తుందని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపై తీన్మార్ మల్లన్న పోరాటం చేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టో లో పెట్టిన ప్రతీ హామిని నెరవేరుస్తుందని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని గ్రామాలనుండి పట్టభద్రులు ప్రజలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

మత్స్యగిరి స్వామి దేవా లయంలో ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానం

శాయంపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ మత్స్యగిరి స్వామి వారి దేవాలయంలో ఈరోజు ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే జీఎస్సార్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. మండల కేంద్రానికి చెందిన జెన్న కృపాకర్ రెడ్డి ఆలయానికి గోవిందరాజస్వామి వారి ఏనుగు రథాన్ని బహు కరించగా, ఆ రథాన్ని ఎమ్మెల్యే జీఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version