నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని వెంకటేశ్వర్లపల్లి,నార్లపూర్,చర్లపల్లి చౌటుపర్తి గ్రామాల బిఆర్ఎస్ గ్రామకమిటీల అధ్యక్షతన ముఖ్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మండల సమన్వయ కమిటీ సభ్యులు హాజరు కావడం జరిగింది.
ఈ సందర్బంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు), ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి సమన్వయ కమిటీ సభ్యులు బొల్లె బిక్షపతి,పాడి ప్రతాప్ రెడ్డి,మచ్చ రవీందర్,కోడెపాక కరుణాకర్,పర్నెం తిరుపతి రెడ్డి,నందికొండ జయపాల్ రెడ్డి,బీముడి నాగిరెడ్డి,గోల్కొండ సదానందం,చందా కుమారస్వామి, తిప్పర్తి సాంబశివ రెడ్డి లు మాట్లాడుతూ త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది.బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఓటరుకు వివరించే విధంగా సమయాత్తం కావాలని అన్నారు.అనంతరం బూత్ కన్వీనర్, కో కన్వీనర్ మెంబర్స్ ను ఎన్నుకోవడం జరిగింది.
కన్వీనర్ కో కన్వీనర్ ల వివరాలు
వెంకటేశ్వర్లపల్లి
ఎరుకల తిరుపతి,వంగ సురేష్
మందోటి రాజు,కొడారి అమరేందర్
నార్లపూర్
కొమురవెల్లి సదానందం, బండ వాసు
ఈర్ల సాగర్, మచ్చ తిరుపతి
చర్లపల్లి
అమ్మ కొమురయ్య, మాడుగుల అమృత రెడ్డి
దావు రాజిరెడ్డి, నీలం కుమారస్వామి
సురుగుల కుమారస్వామి, శనిగరపు కృష్ణంరాజు
చౌటుపర్తి
వేల్పుల రమేష్, బోయిని పాపిరెడ్డి
దుప్పటి ఉపేందర్, గూడెం స్వామి
ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు బొల్లారం అనిల్ కుమార్, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ పోచంపల్లి రఘుపతి, తిప్పర్తి ప్రశాంత్ రెడ్డి, నడికూడ మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దోమ పవన్, నాలుగు గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామకమిటీల అధ్యక్షకార్యదర్శులు, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.