అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే కేసీఆర్ ధ్యేయం:ఎంపీ రవిచంద్ర

కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు సముచిత ప్రాధాన్యతనిస్తున్నది:ఎంపీ రవిచంద్ర

మహిళల పేరిటే పథకాలు,పట్టాల పంపిణీ:ఎంపీ రవిచంద్ర

ఖమ్మం జిల్లా నేటి ధాత్రి

ఎంపీ రవిచంద్ర మంత్రి అజయ్ కుమార్ తో కలిసి పేదలకు ఇళ్ల పట్టాలు, గృహలక్ష్మీ ప్రొసీడింగ్స్ పంపిణీ
అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ధ్యేయమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.అందులో భాగంగానే గృహాల క్రమబద్ధీకరణ,డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, గృహలక్ష్మీ పథకానికి రూపకల్పన చేశారన్నారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి రవిచంద్ర 58,59 జీవోల ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలు, గృహలక్ష్మీ పథకం ప్రొసీడింగ్స్ అందజేశారు.ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యత లభిస్తున్నదని,వారిని దృష్టిలో పెట్టుకునే పలు సంక్షేమం,సముద్ధరణనుపెట్టుకునే పలు పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని వివరించారు.గృహలక్మీ మరో మంచి పథకమని,సొంత స్థలం కలిగిన కుటుంబాలకు మహిళల పేరిట 3లక్షల రూపాయలు ఉచితంగా అందిస్తున్నామని ఎంపీ రవిచంద్ర చెప్పారు.ప్రభుత్వాసుపత్రుల్లో కేసీఆర్ కిట్ తో పాటుగా మెరుగైన వైద్య సేవలు ఉచితంగా లభిస్తున్నాయని వివరించారు.కార్యక్రమంలో నగర మేయర్ నీరజ, స్థంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోరేపల్లి శ్వేత, బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు పగడాల నాగరాజు, బీఆర్ఎస్ నాయకుడు శీలంశెట్టి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version