కౌశిక్ రెడ్డి నే హుజురా’బాద్ షా’

హుజురాబాద్ లో కారు స్పీడును ఆపేదెవరు
అడుగడుగునా జననీరాజనం


చరిత్ర తిరగరాయబోతున్న యువ కెరటం
ప్రచారంలో దూసుకుపోతున్న కౌశిక్ రెడ్డి కుటుంబం

హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నిక అంటే ఎప్పుడు ఉత్కంఠ భరితమే. ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేసిన ఇక్కడ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతుంటాయి. గత కొంతకాలంగా రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా హుజురాబాద్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈటెల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడి రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. ఉప ఎన్నికల సమయంలో కూడా దేశవ్యాప్తంగా అందరి చూపును ఈ నియోజకవర్గం ఆకర్షించింది. ఇప్పుడు కూడా సాధారణ ఎన్నికల సమీపిస్తున్న సమయంలో మరో ఆసక్తికరమైన విషయం ఈ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కూడా తనదైన శైలిలో నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడు. బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరింత దూకుడు పెంచి ప్రజల్లో మమేకమవుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. హుజరాబాద్ లో మినీ స్టేడియం తోపాటు జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఇక్కడి ప్రజలలో నమ్మకాన్ని చూరగొన్నాడు. బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు హుజురాబాద్ నియోజకవర్గం మీద గతంలో పట్టు ఉన్నప్పటికీ ఉప ఎన్నికల్లో గెలిచిన అనంతరం నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడింది.ఇక ప్రణవ్ బాబు విషయానికి వస్తే నిన్న మొన్నటివరకు టిఆర్ఎస్ లో ఉండి గత కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ లో చేరడంతో హుజురాబాద్ లో రాజకీయ చర్చ మొదలైంది. ఈసారి హుజురాబాద్ నియోజకవర్గం లో గెలిచేది ఎవరంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తూ తన మాటలతో నియోజకవర్గ ప్రజల దగ్గర మెప్పు పొందుతున్నాడు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, మరోవైపు తాను నియోజకవర్గానికి చేయబోతున్న అంశాలను వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. దీంతోపాటు గెలిచిన తర్వాత 1000 కోట్లతో హుజురాబాద్ను మరో సిద్ధిపేట తీర్చిదిద్దుతానని చెప్పడంతో ప్రజలు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ తన 6 గ్యారంటీల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేసింది. ఇంతలోనే బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కొత్త మేనిఫెస్టో తీసుకురావడంతో కాంగ్రెస్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకంటే టిఆర్ఎస్ ప్రవేశపెట్టిన కొత్త మేనిఫెస్టోలో పథకాలే బాగున్నాయంటూ జనాలు బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే స్థాయిలో పాడి కౌశిక్ రెడ్డి కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త మానిఫెస్టోను ప్రజలకు తనదైన శైలిలో వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. కౌశిక్ రెడ్డి తో పాటు తన కుటుంబ సభ్యులైన భార్య శాలిని రెడ్డి కూతురు శ్రీనిక రెడ్డి కూడా ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఒకవైపు కౌశిక్ రెడ్డి తన పదునైన మాటలతో జనాల మనుషులు గెలుస్తుంటే మరోవైపు కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని కూడా తన మాటలతో నియోజకవర్గ ప్రజలను మెప్పిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా మీతోనే ఉంటున్నాం అంటూ తమ కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరుతూ అవకాశం ఇచ్చి గెలిపిస్తే తాను కూడా భర్త వెంటే ఉంటూ ప్రజల సేవ చేసుకుంటానని, కొంగు చాపి అభ్యర్థిస్తున్నాను ఓటు బిక్షల వేయాలంటూ మాట్లాడడంతో చాలామంది మహిళలు మద్దతు పలుకుతున్నారు. ఇక కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనిక కూడా ఒక్కసారి మా డాడీకి ఓటేరా ప్లీజ్ అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా డాడీ ప్రతి గ్రామాన్ని హైదరాబాదుల తీర్చి దిద్దుతాడని చెప్పడంతో ప్రజలంతా ఆ పాప మాటలకు ముగ్దులైపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత రెండు నెలల నుంచి కాలికి బలపం కట్టుకొని తిరగడంతో ప్రజలలో అనూహ్య స్పందన వచ్చింది. ప్రచార సమయంలో వచ్చే స్పందనతో పాటు చాలామంది ఈ ఒక్క సారి కౌశిక్ రెడ్డికి అవకాశం ఇవ్వాలంటూ చర్చించు కుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న ప్రజాస్పందన చూస్తే గెలుపు అనివార్యమే అవుతుందని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ఇలా ప్రచార స్పీడ్ పెంచి ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లిన ఒకటే మాట వినబడుతుంది గతంలో ఏడు పర్యాయాలు ఇక్కడి నుంచి గెలిపించుకున్న ఈటెల రాజేందర్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని కౌశిక్ రెడ్డి కి నియోజవర్గానికి ఏదో చేయాలని తాపత్రయంగా ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలు తమ పూర్తి మద్దతు ఇస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నట్లు బహిరంగ ప్రకటన కూడా చేశాయి. గ్రామాలతోపాటు కొన్ని కుల సంఘాలు, మత సంఘాలు కూడా ఇప్పటికే తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఇంతే కాకుండా తన ప్రసంగంలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని మరి అభివృద్ధి చేస్తాననడంతో ఆ గ్రామాలు కూడా కౌశిక్ రెడ్డికి జై కొడుతున్నాయి. వీటితోపాటు బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ అండదండలు ఉండడంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రజలు కూడా ఒకసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారనే మాట బలంగా వినిపిస్తుంది. ఇలా అన్ని వెరసి ఈసారి హుజురాబాద్ గడ్డపై గులాబి జెండా ఎగురుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడున్న అన్ని సమీకరణలు చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసి హుజురా’బాద్ షా’ గా చరిత్ర సృష్టించబోతున్నారని నియోజకవర్గమంతా చర్చించుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version