నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి దసరా వేడుకలు రావణాసుర వధ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగు ఏర్పాట్లు వెంటనే చేయించావలసిందిగా ఎమ్మెల్సీని కోరారు. ఎమ్మెల్సీ సారయ్య వెంటనే స్పందించి ప్రభుత్వపరంగా తగిన ఏర్పాట్లు చేపిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా బస్వరాజు సారయ్య మాట్లాడుతూ కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితితో తనకు ఎనలేని బంధం ఉందని తెలియజేశారు. సారయ్య ను కలిసిన వారిలో ఉత్సవ సమితి కన్వీనర్ మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, గుల్లపెల్లి రాజకుమార్, గోరంటల మనోహర్, గోరంట్ల రాజు, మార్త ఆంజనేయులు ,రాచర్ల శ్రీనివాస్, సిద్దోజు శ్రీనివాస్, సిలువేరు థామస్, ఓం ప్రకాష్ కొలారియా, ఎరుకల రఘునారెడ్డి, గుర్రపు సత్యనారాయణ, కొరవి పరమేష్, వెలిశాల బాబు, రామయాదగిరి, ములుక సురేష్, తోట బాలరాజు, సిద్ధం చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.