నేటి ధాత్రి జమ్మికుంట.
ఈరోజు గాంధీ భవన్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో పోస్ట్ ఎలక్షన్ ఫీడ్బ్యాక్ పార్లమెంట్ కోఆర్డినేటర్స్ తో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్ మున్సి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ మేనేజింగ్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ ఎక్స్ ఎమ్మెల్సీ, బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ, పుష్పలీల మాజీ మంత్రివర్యులు, రాముల నాయక్ ఎమ్మెల్సీ , వినోద్ రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మొలుగూరి సదయ్య కోఆర్డినేషన్ చేసిన పనులు పార్లమెంట్ ఆర్గనైజేషన్ గురించి కమిటీ ముందు తెలపడం జరిగింది కమిటీ నివేదిక దీపాదాస్ గారికి మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కి అందించడం జరిగింది
