కరీంనగర్ కళాభారతికి మిద్దె రాములు కళాభారతిగా నామకరణం చేయాలి.

సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా వేములవాడ ప్రాంతంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా తన ఒగ్గు కథలు చెప్పి ఎంతోమందిచే మన్ననలు పొందిన బీసీ గౌడ కులానికి చెందిన మిద్దె రాములు పేరు పెట్టడం ద్వారా నేటి యువతరానికి ఆయన సేవలు తెలిపిన వారవుతామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మిద్దె రాములు కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరిగి తన ఒగ్గు కథను చెప్పినటువంటి చరిత్ర ఆయనకు ఉందన్నారు. మిద్దె రాములు ఒగ్గు కథ బోనం ప్రదర్శన ఆనాటి విద్యార్థుల్లో ఒక ప్రభంజనం సృష్టించిందని ఆయన కథా ప్రభావం ఎంతలా ఉండేదంటే కథ విన్న రెండు రోజుల దాకా గ్రామాల్లోని స్త్రీలు వృద్ధులు ఆయొక్క కథలోనే మమేకమై కథలోని పాత్రలో వారు పడ్డ కష్టాలను గుర్తించుకునేవారని తెలిపారు. మిద్దె రాములు కథ వినడం కోసం పక్క గ్రామాల నుంచి వచ్చి రాత్రంతా ఉండి కథ వినివెళ్లే వారన్నారు. కథల ద్వారా ఎంతోమంది ప్రజలను చైతన్యపరిచి తన కలలు ప్రజలకు అందించిన చరిత్ర ఆయనదని, ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని, ఎన్నడూ కూడా తన కోసం ఆస్తులు సంపాదించుకోవాలని ఆలోచన లేని వ్యక్తి అని ఆయన లాంటి వ్యక్తి మనం చూడలేమని సమాజంలో ఎంతోమందికి ప్రేరణగా ఉన్న ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ మిద్దె రాములు పేరును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబులు కళాభారతికి మిద్దె రాములు పేరు పెట్టేందుకు కృషి చేయాలని, ముత్యం శంకర్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version