కారణజన్ముడు..తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రుడి జన్మదిన వేడుకలు

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి..స్వీట్లను పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 17
మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కారణజన్ముడిగా..తెలంగాణ జాతిపితగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, జడ్పిటిసి జోరుక సదయ్య, సర్పంచుల ఫోరం ప్రస్తుత మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, వైస్ ఎంపీపీ పోలినేని రాజేశ్వర్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి..స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి..తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన స్పాప్నికుడు..తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన అపర భగీరథుడు..ప్రతి ఇంటికి సంక్షేమం అనే నినాదంతో బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో..నిండు నూరేళ్లు..సుఖ సంతోషాలతో ఉండాలని..ప్రజల దీవెనలతో మళ్లీ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని ఆ దేవదేవున్ని వేడుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మంద సుధాకర్, పిడిసిల్ల మాజీ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మొగుళ్ళపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఏలేటి నరసింహ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పెద్ద కొమటీపల్లి గ్రామ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కత్తి రాజు గౌడ్, చిట్యాలవ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ముడుపు రవీందర్, నాయకులు చెక్క శ్రీధర్, పొతంగల్ జనార్ధన్, లడే శివాజీ, మంగలపల్లి శ్రీనివాస్, దేవునూరి కుమారస్వామి, బోల్లెపల్లి తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version