కమ్మగాని సోమయ్య మరణం వామపక్ష రాజకీయాలకు తీరని లోటు

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న

పాలకుర్తి నేటిధాత్రి

కామ్రేడ్ కమ్మగాని గుణ సోమయ్య మరణం వామపక్ష రాజకీయాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న అన్నారు. బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలో కామ్రేడ్ సోమయ్య సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సభకు సిపిఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య అధ్యక్షత వహించగ సోమన్న పాల్గొని మాట్లాడుతూ సోమయ్య పాలకుర్తి టౌన్ లో సిపిఎం బలోపేతం కోసం కృషిచేసి సిపిఎం సర్పంచ్ గా గెలవడం కోసం తన శాయశక్తుల కృషి చేశారని, చనిపోయేంతవరకు కూడా సిపిఎం ప్రజా సంఘమైన తెలంగాణ కలిగిత కార్మిక సంఘంలో చురుగ్గా పాల్గొనే వాడని నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రజల మధ్య విద్దేశాలు రెచ్చగొట్టి పాలన చేస్తుందన్నారు. ధరలు పెంచి ప్రజలపై భారాలు వేస్తుందన్నారు కట్టలేక దారుణమైన పరిస్థితికి చేరుకున్నారన్నారు. నేటి తరం యువతీ, యువకులు ప్రజలు కార్మికులు, రైతులు సోమయ్య ను ఆదర్శంగా తీసుకొని ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రాబోయే ఎన్నికల్లో ఓడించి దేశాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు సోమసత్యం, సీనియర్ నాయకులు సోమ అశోక్ బాబు, బెల్లి సంపత్, తెలంగాణ కలిగిత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య, సిపిఎం నాయకులు గట్ల మల్లారెడ్డి, తెలంగాణ కల్లుగిత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కమ్మగాని నాగన్న, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఏదినూరి మదర్, వారి కుటుంబ సభ్యులు కమ్మగాని వెంకన్న, కమ్మగాని మహేందర్, పులి ఎలేంద్ర యాదగిరి, చాట్ల శ్యామల, కమ్మగాని కొండమ్మ, సిపిఎం నాయకులు నక్క రమేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు విగ్నేష్, జ్యోతి కొమురయ్య, మర్చిపోడు సోమయ్య, బి కుమార్, ఒగ్గుల కొమురయ్య, రమ్య, మను,నరేష్, సోను, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version