పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణయూత్ కాంగ్రెస్ మచ్చసుమన్ ఆధ్వర్యంలో కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల పట్టణం మరియు రూరల్ యూత్ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం మచ్చ సుమన్ మాట్లాడుతూ ప్రవేశపెట్టిన న్యాయ గ్యారంటీలను మహిళా న్యాయం,రైతు న్యాయం,శ్రామిక్ న్యాయం, సమానత్వ న్యాయం, వివరించడం జరిగింది.2014లో అధికారంలో వచ్చిన బిజెపి పార్టీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసపూరితమైనటువంటి ప్రకటనలతో అదేవిధంగా నోట్ పెద్ద నోట్ల రద్దు ప్రక్రియను కూడా చేపట్టిందని దేశంలోని యువతను మోసం చేసింది అధికారం చేపట్టిన వెంటనే బయటకు తీసి అకౌంట్లో 15 లక్షల రూపాయలను వేస్తామని మోసపూరితమైన ప్రకటనలతో యువతను మోసం చేసిందని అన్నారు.యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్క కిరణ్ మాట్లాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ ప్రస్థానం తెలంగాణకు మణిహారమని మహాలక్ష్మి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండు చేయూత 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం గృహ జ్యోతి 2 యూనిట్ల ఉచిత కరెంటు నాలుగు ఇందిరమ్మ ఇల్లు ఇంటి నిర్మాణానికి 5 లక్షల సహాయం మహాలక్ష్మి 6,30 వేలపై చీలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ,గ్రూప్ వన్ మెగా డీఎస్సీ,సింగరేణి ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ వరంగల్ పార్లమెంటరీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ దొమ్మటి కృష్ణ కాంత్,పరకాల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి రాంప్రసాద్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం శ్రీ రామ్ కుమార్,బాసాని సుమన్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఒంటేరు రమేష్,ఒంటేరు చందు, కొడపాక సాయి,ఎండి ఆరిఫ్,బొచ్చు కార్తీక్,బొజ్జం అనిల్,బొచ్చు కుమార్,ఎస్ కే యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
