ప్రజాప్రభుత్వంలో పేదలందరికి న్యాయం

మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధికి కృషి చేస్తాం

36 లక్షల 4 వేల కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మొగుళ్లపల్లి నేటి ధాత్రి
మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని 36 మంది లబ్ధిదారులకు 36 లక్షల 4వేల 176 రూపాయల విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలందరికి న్యాయం జరుగుతుందని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది యేళ్లలో అధికారం చేపట్టిన కేసీఆర్ అభివృద్ధి కాదు. అప్పులు చేసిండని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఋణ మాఫీ, గిట్టుబాటు ధర, పండించిన పంటకు బోనస్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పథకాలను. అర్హులందరికీ అందిస్తున్న క్రమంలో. బిఆర్ఎస్ పార్టీ తట్టుకోలేక వారి అబద్దాలను నిజం చేసేందుకు రోడ్డెక్కి ముసలి కన్నీరు కారుస్తున్నారని. ఇవన్నీ రైతులు నమ్మేస్థితిలో లేరని. 21 వేల కోట్లు రాళ్లు రప్పులున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతుబంధు ఇచ్చారాని, అసలైన రైతులకు జనవరి 26 న రైతులకు రెండు పంటలకు 12 వేల చొప్పున రైతు బంధును కూడా ఇస్తున్నట్ల అయన తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులను నమ్మే పరిస్థితిలో రైతులు లేరని ఎమ్మెల్యే అన్నారు. మొగుళ్లపల్లి మండలంలో సంవత్సర కాలంలో 29 కోట్ల 70 లక్షలు. రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేయడం జరిగిందని. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను పాక్కాగా కట్టిస్తుందని నిరు పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉండి ఏమీ చేయలేక, ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రోజుకు 18 గంటల కష్టపడుతున్నట్లు గత ప్రభుత్వం కనీసం మండలానికి ఒక అంబులెన్సు ఇవ్వలేదని. నేడు ప్రజల కోరిక మేరకు అంబులెన్సు సౌకర్యం మొగుళ్లపల్లి మండల ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ, పిఏసిఎస్ చైర్మన్ సంపల్లి నర్సింగారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్, బండి సుదర్శన్ తక్కళ్లపెల్లి రాజు, మోటె ధర్మారావు,ఎర్రబెల్లి పున్నం చందర్ రావు, ఏలేటి శివారెడ్డి, ఆకుతోట కుమారస్వామి, పెంతల మధుకర్ రెడ్డి, బొల్లపెల్లి పరుశరాములు గౌడ్, దండె వెంకటేశ్వర్ రెడ్డి,తహసీల్దార్ సునీత, ఎంపిడిఓ మహ్మద్ హుస్సేన్, ఆర్ ఐ సురేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version