వనపర్తిలో విలేకరుల నిరసన

వనపర్తి నెటిధాత్రి
మీడియాపై మోహన్ బాబు చేసిన దాడి చేయడాన్ని ఖండిస్తూ బుధవారం ఐజేయు విలేకరుల సంగం పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రం రాజీవ్ చౌరస్తాలో టిడబ్ల్యూజే ఐజేయు వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలోవిలేకరులు నిరసన వ్యక్తం చేశారు .విలేకరుల పై దాడిని ఖండించాలని,దాడికి పాల్పడ్డ మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
టి యు డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ మాట్లాడుతూ సినిమా నటుడు పెద్ద రాయుడు మతిస్థిమితం కోల్పోయి జీరో రాయుడుగా తయారయ్యాడని విమర్శించారు , ఎన్నో సినిమా రంగాలలో దేవత రూపంలో నటనలు చేసిన మోహన్ బాబు అయ్యప్ప స్వామి భక్తుడు స్వామి ధరించిన టీవీ9 జర్నలిస్టుపై దాడిచేసి అత్యాయత్నానికి పాల్పడిన విషయం సినిమా రంగానికి తెలంగాణ సమాజానికి సిగ్గుచేటని ఆయన విమర్శించారు, బాబు మోహన్ మతిభ్రమించి మతిస్థిమితం కోల్పోయి టీవీ9 విలేకరితోపాటు టీవీ5, ఈటీవీ విలేకరులపై దాడులు చేసి పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించిన మోహన్ బాబు పై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతినిత్యం ప్రతిక్షణం అణువు అణువునా ఎలాంటి జీతాలు లేకపోయినా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని విలేకరుల పట్ల ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాడులను సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఐజేయు మాజీ నేషనల్ కౌన్సిల్ సబ్యులు వనపర్తి సీనియర్ విలేకరి మల్యాల బాలస్వామి మాట్లాడుతూ యాక్షన్ కింగ్ మోహన్ బాబు నటనలు విలేకరుల వద్ద సాగవనిఅన్నారు.జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించినమోహన్ బాబు పై చర్యలు తీసుకువాలని విలేకరు లు మోహన్ బాబును వదిలిపెట్టరని ఆన్నారు .ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజే ఐజేయూ జిల్లా కార్యదర్శి డి.మాధవరావు,వనపర్తి జిల్లా విలేకరుల రాజు, లక్ష్మణ్, విజయ్, సీనియర్ విలేకరి కె రవిశంకర్ గౌడ్ విలేకరులు వహీద్,ఆంజనేయులు,అరుణ్ కుమార్, శ్రీనివాసులు, మన్యం పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version