రామయంపేట (మెదక్) నేటి ధాత్రి.
రామయంపేట మండలం రాయల పూర్ గ్రామానికి చెందిన వడ్ల పవన్ కుమార్ వ్యవసాయ శాఖ నందు మండల వ్యవసాయ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం పొందడం జరిగింది ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 148 మంది మండల వ్యవసాయ అధికారులను నియమించింది అందులో భాగంగా రాయిలాపూర్ గ్రామానికి చెందిన వడ్ల పవన్ కుమార్ మండల వ్యవసాయ అధికారిగా మాచారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాలో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.