సిపిఎం చండూరు మండల కార్యదర్శిగా జెర్రిపోతుల ధనంజయ గౌడ్

నల్లగొండ జిల్లా,నేటి ధాత్రి:
సిపిఎం చండూరు మండల కార్యదర్శిగా జెర్రిపోతుల ధనంజయ గౌడ్ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చండూరు మండల కేంద్రంలో జరిగిన మండల మహాసభలో ఆయన మాట్లాడుతూ, చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు అద్వానంగా తయారైందని, వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆయన అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇంతవరకు అమలు చేయలేదనిఆయన అన్నారు. వృద్ధులకు,వితంతువులకు,గీత కార్మికులకు,చేనేత కార్మికులకు,ఒంటరి మహిళలకు వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. డిండి ఎత్తిపోతల పథకం డీ పీ ఆర్ లు ఆమోదించాలని,పర్యావరణ, అటవీశాఖ అనుమతులు ఇచ్చి, చర్లగూడెం రిజర్వాయర్ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి, నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభలో ఇలా పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తీర్మానం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నకార్మిక,రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలన్నారు.కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలోఆందోళన, పోరాటాలు చేపడతామని అందుకు ప్రజలంతా సహకరించాలని ఆయన అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version