ధాన్యానికి మద్దతు ధరకోసం రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

“కాంగ్రెస్ అధికారంలొకి వస్తే….ఖాయిలా పడ్డ పరిశ్రమలను పున ప్రారంభిస్తాం ..వాణిజ్య పంటలకు ప్రోత్సాహం కల్పించడంలో విఫలమైన ప్రభుత్వాలు పసుపు బోర్డు ఏర్పాటును అటకెక్కించిన అర్వింధ్  చెరుకు రైతులను రోడ్డుమీద పడేసిన ఘనత కవితదే ధాన్యానికి మద్దతు ధరకోసం రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం” – కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా నేటిదాత్రి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణాలో ఖాయిలా పడ్డా పరిశ్రమలను పున ప్రారంభిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో బుధవారం టిపిసిసి ప్రచార కమిటి చైర్మెన్,మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్ పుట్టిన రోజు సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్మానాథ్మక పాత్ర పొశిస్థుంధన్నారు.

జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వపరంగా నడిపించి చెరుకు రైతులను అన్నివిధాల ఆధుకుంటానని చెప్పి ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఆ ఫ్యాక్టరీనే మూయించి రైతులకు తీరని అన్యాయం చేశారని కవిత పై తీవ్రంగా జీవన్ రెడ్డి మండిపడ్డారు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు పంటను రైతులు అధికంగా పండిస్థారని నాకు ఓట్లు వేసి గెలిపిస్థే పసుపు బోర్డ్ తీసుకువచ్చి గిట్టుబాటు ధర కల్పిస్థానని రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి దాన్ని ఎంపీ అరవింద్ అటకెక్కించారని దుయ్యబట్టారు.
ఇరువురు నిజామాబాద్ ఎంపీలు రైతుల విషయంలో మోసం చేశారని చెభుతూ ఎంపీగా మధుయాష్కీ బడుగు,బలహీన,మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజక వర్గాన్ని అభివృద్ధి పర్చాడని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పసుపు,మిర్చి వాణిజ్య పంటలకు ప్రోత్సాహకాలు కల్పించక పోవడంతో రైతులు తీవ్రంగా నస్టపొయారని కెంధ్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు ప్రత్యామ్నాయoగా ఆరుతడి పంటలు వేసుకోవాలని చెబుతూ వాటికి అవసరమైన చర్యలు తీసుకోవడం లేదనీ విమర్శిస్తునె జగిత్యాల ప్రాంతంలో చెరుకు పంట అనుకూలంగా ఉంటుందని దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుథ్వానికి సూచించారు.

రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విపలమయ్యయని ఆరోపించారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర కల్పించడంకొసం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణా ఉద్యమంలో మధుయాష్కి కీలకంగా వ్యవహరించి సోనియాగాంధీకి తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను వివరించి సానుకూలపరిచారని వివరించారు.

మధు యాష్కి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లురి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కేకు కట్ చేసి నాయకులకు తినిపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిరి నాగభూషణం,దేవేందర్ రెడ్డి, బండ శంకర్ , ధుర్గయ్య,మన్సుర్ ఆలీ, రామచంద్రా రెడ్డి, చిట్ల అంజన్న , జున్ను రాజేందర్, గుండా మధు, రఘువీర్ గౌడ్, తోట నరేశ్,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version