జైపూర్ ఎస్టిపిపిని దేశంలోనే అత్యుత్తమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలి 

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో మంగళవారం రోజున సింగరేణి కాలరీస్ సంచాలకులు (ఈ అండ్ ఎం ) డి.సత్యనారాయణ రావు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఎస్టిపిపి అధికారులు మరియు కార్పొరేట్ అధికారులతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాల సాధనకై మేధోమధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న కార్పొరేట్ అధికారులు మరియు ఎస్టిపిపి లో పనిచేస్తున్న అధికారుల నుండి ఉత్పత్తికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో అలాగే ఎస్టిపిపి ని దేశంలోనే అత్యుత్తమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. పిఎల్ఎఫ్ ని పెంచడం ద్వారా అధిక విద్యుత్ ఉత్పత్తి చేసి ఈ వేసవి కాలంలో విద్యుత్ కు కొరత రానియ్యవద్దని,విద్యుత్ ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించాలని తద్వారా రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో మన వంతు పాత్ర పోషించాలని, రాష్ట్ర మరియు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో తీసుకోవలసిన చర్యలపై సమీక్ష చేసి అవసరమైన ఆదేశాలను మరియు అనుమతులను ఇవ్వడం జరిగింది.అన్ని సందర్బాలలోనూ పొదుపు పాటిస్తూ విద్యుత్ ఉత్పత్తి ఖర్చును తగ్గిస్తూ అధిక యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించి, రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసేలా కృషి చేయాలని,అలాగే సౌర విద్యుత్ కేంద్రాల నిర్వహణ చూసుకుంటూ, సౌర విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయాలని, అలాగే ప్లాంటు నిర్వహణలో మరియు రక్షణతో కూడిన విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని అయన సూచించారు.

*శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్న సింగరేణి డైరెక్టర్ డి సత్యనారాయణ రావు*

బుధవారం రోజున శ్రీరామనవమి సందర్భంగా సింగరేణి డైరెక్టర్ డి. సత్యనారాయణ రావు ఉదయం నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొనడమే కాకుండా తదనంతరం జరిగిన కళ్యానొత్సవంలో పాల్గొని సీతారామ కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఎస్టిపిపి లో ఉద్యోగులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మన సంఘటిత శక్తిని చాటామని ఆయన అభినందించారు. అనంతరం ఎస్టిపిపి లో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎస్ఎల్ డిసి వారి ఆదేశాల మేరకు ఉత్పత్తిని పెంచడం మరియు తగ్గించడం జరుగుతుందని, ఇలా ఉత్పత్తిలో హెచ్చు- తగ్గులను ప్లాంటు సమర్ధవంతంగా తట్టుకొని పారామీటర్స్ అన్ని సక్రమంగా ఉండేలా చూసుకొనే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి బీహెచ్ఈఎల్ అధికారులతో చర్చించడం జరిగింది. ఈ విషయమై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలలో ఈడి ఎస్టిపిపి బసివి రెడ్డి, జిఎం (సోలార్)జానకిరామ్, జిఎం (వర్క్ షాప్స్) ఫిజరాల్ద్ , చీఫ్ (పవర్ ప్రాజెక్ట్స్) ఎన్వికే విశ్వనాధ రాజు, ఎజిఎం (ఫైనాన్సు) సుధాకర్, ఎజిఎం కే.వెంకటేశ్వర్ రావు, ఎజిఎం ఎం.ఎన్.వి. రమణ, ఎస్వోటు ఈడి శ్రీ ప్రభాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version