హస్తం గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపే బాధ్యత మనది

భద్రాచలం నేటిదాత్రి

బలరాం నాయక్ ని కేంద్రమంత్రిగా చేసే బాధ్యత సోనియమ్మది.

భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు

ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ భద్రాచలంలో భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు నేతృత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రజలతో మమేకమై మాట్లాడుతూ

కేంద్రంలో ఇండియా కూటమి అధికారాన్ని చేపడితే ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఐదు న్యాయాలు,అందులో దేశ ప్రజలందరికీ ఉపయోగకరంగా పొందుపరిచినటువంటి అంశాలను ప్రజలకు వివరించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం కారణము ప్రజలేనని, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా నిర్ణయాలకు అనుగుణంగా పరిపాలన అందిస్తుందని.

కాంగ్రెస్ పార్టీ ప్రజాధరణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెండుగా ఉండి పార్లమెంట్ అభ్యర్థులుగా మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధిగా బర్రిలో ఉన్నటువంటి పోరిక బలరాం నాయక్ ని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని ఆయన మాట్లాడారు.

ఈ ఎన్నికల ప్రచారంలో
కాంగ్రెస్ నాయకులు తాండ్ర నరసింహారావు,కొండిశెట్టి కృష్ణమూర్తి,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాస మల్ల రాము, రత్నం రమాకాంత్, పి. శ్రీనివాస్,బంబోతుల రాజీవ్,చింతాడి రామకృష్ణ,నర్రా రాము,అన్నెం రామిరెడ్డి,దుదుకూరి సాయిబాబా, గాడి విజయ్,సిపిఎం నాయకులు బాలనరసారెడ్డి,వెంకట్ రెడ్డి,మహిళా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి,కెతినేని లలిత,కట్ట కళ్యాణి, రూపా దేవి, లక్ష్మీకాంతం,సిపిఎం,కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version