పిల్లలు ఆరోగ్యంగా ఎదగడం ముఖ్యం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధ్యరంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలల్లో నిర్వహించే జాతీయ పోషక మాసం కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున జైపూర్ మండలం మిట్టపెల్లి గ్రామంలోని మిట్టపల్లి -2 అంగన్వాడి సెంటర్ నందు పోషణ మాసం ఉత్సవాలు లబ్దిదారులు,పిల్లలతో,
వారితల్లి తండ్రులతో నిర్వహించడం జరిగింది.అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం, పాలు,గుడ్లు,గర్భిణీ స్త్రీలకు, అలాగే బాలింత పిల్లలు కు అందిస్తున్న పౌష్టిక ఆహారం,నిత్యం తీసుకోవాలి,అలాగే గర్భిణీ స్త్రీలు ప్రతి నెల సరైన చికిత్స అందుకోవాలని అదేవిధంగా 102, 108 సేవలను గర్భిణీ స్త్రీలు బాలింతల సేవలు ఉపయోగించుకోవాలని అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు అనీమియా తో బాధపడకుండా ఐరన్ విటమిన్స్ ఆహారం తీసుకోవాలని గర్భిణీ స్త్రీలు ప్రతి నెల చికిత్స తీసుకోవాలని కోరారు. అదేవిధంగా అంగన్వాడి పాఠశాల పిల్లలు వారి యొక్క పెరుగుదల ఆరోగ్యం కొరకు అంగన్వాడి సెంటర్లో అందిస్తున్న పౌష్టిక ఆహారం గుడ్లు,పాలు,బాలమృతం మరియు బాలమృతం ప్లస్
పిల్లలకు నిత్యం అందించాలని పౌష్టిక ఆహారం తీసుకున్నప్పుడే పిల్లలు యొక్క పెరుగుదల,బలంగా,పిల్లలు ఉంటారని పౌష్టికాహారం పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని ఆరోగ్యంగా బాగుంటారని అన్నారు..గర్భిణీ స్త్రీలు సరైన శాఖాహార,ఆకుకూర,పాలు,పండ్లు తీసుకోవాలని కోరారు.మిట్టపెల్లి ఆరోగ్య కేంద్రం నందు పిల్లల యొక్క టీకాలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాల కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది. అంగన్వాడి పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్య బోధనలు బోధించడం జరుగుతుందని పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు కాకుండా ప్రభుత్వ అంగన్వాడి పాఠశాలలకు పంపించాలని కోరడం జరిగింది. అదేవిధంగా పోషణ మాసం లో భాగంగా అంగన్వాడి పాఠశాల పిల్లల యొక్క తల్లులు బాలమృతం తో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసి రావడం జరిగింది.తీసుకొని వచ్చిన వంటకాలను పరిసరించారు. ఇలాంటి వంటలను పౌష్టిక ఆహారం రూపంలో పిల్లలకి అందించాలి. పిల్లలు యొక్క తల్లులు తీసుకువచ్చిన బాలమృతంతో తయారుచేసిన వివిధ వంటకాలను పరిశీలించి విజేతలకు బహుమతులు అందించడం జరిగింది. కొమ్ముగూడెం అంగన్వాడి సెంటర్ లో 6 నెలల బాబు కి అన్న ప్రసన కార్యక్రమం నిర్వహించారు.సరైన అంగన్వాడి భవనం లేక ఇబ్బంది పడుతున్నామని పిల్లల యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా అంగన్వాడి పాఠశాల టీచర్ తెలపగా మరికొద్ది రోజుల్లోనే చెన్నూర్ ఎమ్మెల్యే తో భవనం మంజూరు చేపిస్తామని స్థానిక నాయకులు కామెర మనోహర్ హామీ ఇచ్చారు.
అనంతరం జాతీయ పోషణ మాసం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ రజిత, ఐసీడీఎస్ సూపర్ వైజర్ కవిత, జిల్లా మహిళా సాధికారిత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ సౌజన్య,
అంగన్వాడి పాఠశాల టీచర్ షెగ్గం నిరోష, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గాజుల ప్రవీణ్, ఏఎన్ఎం రాణి, కాంగ్రెస్ నాయకులు మనోహర్, పిల్లల తల్లి తండ్రులు, గర్భిణీ స్త్రీలు ,ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version