నిధుల దుర్వినియోగం పై విచారణ అంటే ఉలుకెందుకు!!

నిధుల దుర్వినియోగం పై బహిరంగ చర్చకు సిద్దం!!
పంచాయతీ నిధుల దుర్వినియోగం విషయంలో ప్రభుత్వం నీకు క్లీన్ చిట్ ఇచ్చిందా?!!!
ఎంపీటీసీ సభ్యులు మహ్మద్ బషీర్!!
ఎండపల్లి, నేటి ధాత్రి
ఎండపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి దుర్వినియోగం చేశారని తెలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాత్రికేయుల సమావేశంలో మాట్లాడినందుకుగాను నిన్నటి రోజున తాజా మాజీ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి అవినీతి ఆరోపణలపై వివిధ రకాలుగా గాలి మాటలు మాట్లాడుతూ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తన యొక్క అవినీతిని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడడం తన యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం అని ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్ పేర్కోన్నారు. శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో తప్పు చేయకపోతే భయం ఎందుకనీ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అవినీతి చేయకపోతే బాధ్యతగా భావించి నిరూపించుకోవాలనితాను చేసిన అభివృద్ధి నీ కళ్ళు కనబడకపోతే గ్రామస్తులను అడిగి తెలుసుకుంటే బాగుంటుందనీ హితవు పలికారు. నా రాజకీయ అనుభవమంత వయస్సు లేదని విమర్శించారు.ప్రజల మధ్యలో మీరు ఎలాంటి తప్పు చేయలేదా అని ప్రశ్నించారు .మీరు చేసిన తప్పులు కొన్ని రకాల పనులకు, పనులు చేయించక ముందే ముందస్తుగానే డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. నిధులు దుర్వినియోగం చేసినట్టు కాదా అని విమర్శించారు.మీ ఇరువురు అన్నదమ్ములు కలిసి కొండలు చెట్లు ఒక వ్యాపారంగా మలుచుకొని మట్టిని తరలించుకుపోయి అమ్ముకున్న సంఘటనలు అనేకం వున్నాయనీ, మీరు ఏ తప్పు చేయలేదని ప్రభుత్వం మీకు క్లీన్ చిట్ ఇచ్చిందా అని ప్రశ్నించారు,ఇవి కాదా మీరు చేసిన దుర్వినియోగం పనులు అని ప్రశ్నించారు, మీరు చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయో గ్రామ ప్రజలు నాయకులు అందరికి గమనిస్తున్నారనీ సర్పంచ్ అంటే ఒక సేవకుడిగా భావించి ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం కల్పించారు అలా అని, ఇది చేసిన అది చేసిన అని చెప్పుకుంటూ గ్రామ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత సేవ చేయడం ఒక దైవ కార్యంగా భావించాలి తప్ప, సర్పంచ్ నీ అనే అహంకారంతో పోయి , ప్రజల్ని ప్రభుత్వ పథకాల కొరకు, మీ దగ్గరకు వస్తే ఘాటుగా హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయని, అదే విధంగా మీరు చేసిన దుర్వినియోగం చాలా ఉంది మరి చెప్పండి అవన్నీ వెలికి తీయమంటారా,? మీ మీద గ్రామ పంచాయతి నిధుల దుర్వినియోగం పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అలాగని ప్రభుత్వం మీకు ఏ తప్పు చేయాలేదని క్లీన్ ఇచ్చిందా అని ప్రజల మధ్యలో ప్రశ్నించారు, ?ఇకనైనా పిచ్చిపిచ్చి ఆలోచనలు మానుకొని నీ మీద అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు అవి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి నిరూపించుకోండి అని హితవు పలికారు, అదేవిధంగా ప్రజాదారణ ఎవరికి ఉందో సమయం వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు, గాలి మాటలు ఎవరివో పనిచేసే వారు ఎవరు ముందే ప్రజలు నిర్ణయిస్తారు మరి ప్రజా తీర్పును మనం ఎప్పుడు గౌరవిస్తూనే ఉన్నాం , ప్రజల మధ్యనే ఉంటున్నాం రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదలకు అన్ని ఫలాలు అందేలా చూస్తామని మేము భరోసా ఇస్తున్నాం, రాబోయే ఎన్నికల్లో ఎవరు ప్రజాదరణ పొందిన వ్యక్తి ,ఎవరు ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి ప్రజాభిమానం చురకోన్న వ్యక్తో,ప్రజలు నిర్ణయిస్తారని పలికారు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అందుర్తి గంగాధర్, దేవి రవీందర్, మాజీ ఉపసర్పంచ్ బూరగడ్డ రవి, మారపల్లి రవీందర్ రెడ్డి, బూరగడ్డ శ్రీనివాస్, నస్పూరి మల్లేశం, మంతెన రాజు, మంతెన లక్ష్మణ్, రమణారెడ్డి మంతెన నర్సయ్య, గుర్రాల చంద్రయ్య, కాల్వ మల్లయ్య, ఆడెపు మల్లేష్, కుసుమరాజు, సింహరాజు సత్యనారాయణ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version