చిట్యాల, నేటిధాత్రి :
స్పెషల్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ చిట్యాల మండల శాఖ క్యాలెండర్ ను చిట్యాల మండల విద్యాశాఖాధికారి కొడెపాక రఘుపతి ఆవిష్కరించారని మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు బండి శ్రీనివాస్, సూదం సాంబమూర్తి తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ హాజరై పి ఆర్ టి యు సంఘం చరిత్రను,సంఘం సాధించిన విజయాలను ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది,ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం చూపే సంఘం అని,సమస్యల సాధనపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసంధానకర్తగా ఉండి సమస్యల సాధనపై పరిష్కార మార్గం చూపిస్తుందని మాట్లాడడం జరిగింది.మండల విద్యాధికారి కోడేపాక రఘుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద సంఘం పిఆర్టియు సంఘం అని కొనియాడడం జరిగింది. అనంతరం మండలంలోని చల్లగరిగ, జూకల్ చిట్యాల, జడలపేట, నైన్ పాక ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రాథమిక పాఠశాలలో నూతన క్యాలెండర్లను ఉపాధ్యాయులకు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఝాన్సీ రెడ్డి, కృష్ణ, వాసంతి, ఊర్మిళా రెడ్డి లతోపాటు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సాంబారు రామనారాయణ ,కూచనపల్లి శ్రీనివాస్ , గోవింద సత్యనారాయణ, రహీం పాషా, మోరిశెట్టి సుజాత,లింగయ్య , సదానందం మధు ,విజయశాంతి, బండి ప్రసాద్, గాజర్ల శ్రీనివాస్, స్వరూప రాణి, పల్లవి, పావని,లతోపాటు తదితర పాఠశాలలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు..