పోలీస్ ఉద్యోగాల్లో…. మెరిసిన కేయూ ఆణిముత్యాలు

కేయూ క్యాంపస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ ఫలితాలలో
కాకతీయ విశ్వవిద్యాలయ ఫ్రీ కోచింగ్ విద్యార్థులు ప్రతిభ చూపారు. 69 మంది కానిస్టేబుల్స్
ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒకరు గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, జేఎల్ఎం ఒకరు ఎన్నికైనట్లు కోచింగ్
సెంటర్ సంచాలకులు డాక్టర్ టీ నాగయ్య తెలిపారు. 2022 మార్చిలో కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి
ఆచార్య తాటికొండ రమేష్ పేద విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్ కేయూలో ఏర్పాటు చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో 1200 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గ్రూప్స్-1,2,3,4, ఎస్సై, కానిస్టేబుల్ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం దాదాపు 6 నెలలు పాటు సుదీర్ఘ బోధన అనుభవం వివిధ విభాగాలలో నిష్ణాతులైన అధ్యాపకులచే శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా జేల్ మరియు డిఎల్ కు కామన్ పేపర్ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు 24 గంటలు లైబ్రరీ అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఉదయం పీజీ క్లాసెస్ అటెండ్ అవుతూ సాయంత్రం 2-6 కోచింగ్ తరగతులకు హాజరవుతూ పరీక్షకు ప్రిపేర్ అయ్యేవారని సంచాలకులు డాక్టర్ నాగయ్య తెలిపారు.

పోలీస్ అభ్యర్థులకు సన్మానం.
విశ్వవిద్యాలయ ఫ్రీ కోచింగ్ సంచాలకులు డాక్టర్ నాగయ్య అధ్యక్షతన భౌతిక శాస్త్ర సెమినార్ హాల్లో అభినందన
కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్
ఆచార్య సురేష్ లాల్ హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమానికి శ్యామ్, రంజిత్ హిమ బిందు, భవాని, మానస, రాకేష్, తేజస్విని, సందీప్,
రమ్య, గణేష్, ప్రసాద్ పాటు 29 పాల్గొన్నారు.

మొదటి ప్రయత్నంలోనే…. ఎస్సై సాధించా… ఆలి పూజా
పూజ నిరుపేద కుటుంబంలో జన్మించింది, తల్లి చిన్న తనములోనే చనిపోయింది, తండ్రి ఆటో డ్రైవర్. సరస్వతి శిశు మందిర్లో టెన్త్, విజ్ఞాన్ కాలేజీలో డిగ్రీ, కేయూ క్యాంపస్ కళాశాలలో ఎంబీఏ చదువుతూనే మొదటి ప్రయత్నంలోనే 22 సంవత్సరాలకే ఎస్ఐ ఉద్యోగం సాధించింది. పోలీస్ ఉద్యోగం మీద ఇష్టంతో కుటుంబ నేపథ్యం దృష్టిలో పెట్టుకొని క్యాంపస్ లో ఎంబీఏ చేస్తూనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది. వర్సిటీలో పీజీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ రావడం వర్సిటీ ఫ్రీ కోచింగ్ ఉద్యోగం రావడానికి ఉపయోగపడినట్లు పూజ తెలిపింది…

కృషి పట్టుదల ఉంటే చాలు… ఎస్సై శ్రావణి

సాధించాలనే పట్టుదల, కృషి ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని నిరూపించింది ఎస్. శ్రావణి. తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి వరకు పూర్తి చేసుకుని హైదరాబాదులోని కోటి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. వీరిది పేద కుటుంబం కావడంతో తండ్రి ఊర్లో చికెన్ షాప్ నడుపుతూ శ్రావణి చదివించాడు. కాకతీయ విశ్వ విద్యాలయంలొ స్టాటిటిక్స్ విభాగంలో పీజీ చదువుతూనే పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అయి ఎస్సై ఉద్యోగం సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియ కాకతీయ విశ్వ విద్యాలయా కోచింగ్ సెంటర్ సహకారంతొ మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం హైదరాబాదులో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నారు. గ్రూప్ వన్ సాధించడమే లక్ష్యమని శ్రావణి తెలిపారు..

అపోహకు దూరంగా ఉండాలి.. . పోటీ పరీక్షల సంచాలకులు డాక్టర్ తండు నాగయ్య
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో
ముందడుగు వేయాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పరీక్షలు చాలా కష్టమైనవిగా భావిస్తుంటారు. ఇంగ్లీష్ మీడియం చదివిన వారే ఉద్యోగాలను సులువుగా సాధించ గలరని అపోహలో ఉంటారు. ముందు ఇలాంటి ఆలోచనలు నుంచి బయటపడాలి. సబ్జెక్టు నాలెడ్జ్ పెంచుకుంటే ఏ పోటీ పరీక్షలో అయినా సులభంగా విజయం సాధించవచ్చు. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు, దినపత్రికలు చదువుతూ పోటీ పరీక్షల కోసం
ప్రత్యేకంగా వచ్చే మ్యాగజైన్లలో ప్రచురితమయ్యే విజయగాతాలు చదువుతూ విద్యార్థులు ప్రేరణ పొందాలి. కొత్త ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మరల వీసి ఆచార్య తాటికొండ రమేష్ అనుమతితో వర్సిటీలో ఉచిత శిక్షణ ప్రారంభిస్తామని అన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version