కోర్టు కేసులో ఉన్న భూమిలో అక్రమంగా బోర్లు నిబంధనలకు నీళ్లు,వాల్టా చట్టానికి తూట్లు

పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించని పోలీసులు

కూకట్పల్లి మే 30 నేటి ధాత్రి ఇంచార్జ్

అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంతో పాటు అక్రమాన్ని సక్రమం చేసుకునే విధంగా వివాదంలో ఉన్న భూమిలో 6 బోర్లు వేసి కోర్టును కూడా తప్పు దోవ పట్టిస్తున్న సంఘటన 1007 సర్వే నంబర్ లో బయటపడింది.
వివాదంలో ఉన్న భూమిలో అక్రమంగా బోర్లు వేసిన పట్టించుకునే నాథుడు కరువయ్యారు.వాల్టా చట్టానికి నిబం ధనలకు తూట్లు పడుతూ అక్ర మంగా బోర్లు వేసినా సంబంధిత అధి కారులు స్పందించడం లేదు.చట్టాన్ని చేతిలోకి తీసుకుని రౌడీ మూకల కను సైగల్లో అక్రమంగా ఒకే చోట ఆరు బోర్లు వేసిన సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వారి అవినీతికి నిదర్శనం. నిబంధనల ప్రకారం బోర్లు వేయాలంటే రెవెన్యూ అధికారులచే వాల్టా చట్టం కింద అనుమతి తీసుకో వాల్సి ఉంటుంది. అయితే రెవెన్యూ అధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అక్రమంగా బోర్లు వేయడం చట్ట విరుద్ధం.కూకట్ పల్లి మండలంలో
ని ఖైతలాపూర్ సమీ పంలో గల 1007 సర్వేనెంబర్లో దాకా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తోపాటు మరి కొందరికి 36 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమి గత కొన్ని సంవత్స రాలుగా కోర్టు కేసులో ఉంది. అయితే ఎన్నికల కోడ్ లో ఉద్యోగులు బిజీబి
జీగా ఉండగా అక్రమ దారులు రౌడీల సహకారంతో ఒకే చోట ఆరు బోర్లు వే యడం విశేషం.ఈ విషయమై ఓ వర్గం వారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసు అధికారులు ఏం మాత్రం సహ కరించడం లేదని తెలుస్తోంది.గత ప్రభు త్వ హాయంలో అవినీతికి మరిగిన అధికారులు ప్రస్తుత ప్రభుత్వంలో సైతం అక్రమాలు జరిగినప్పటికీ పట్టించుకోక పోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడు తుంది.తమ భూమిలో అక్రమంగా ఆరు బోర్లు వేసారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా వాటిని సీజ్ చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. అయితే పోలీస్ ప్రొటెక్షన్ కోసం రెవెన్యూ అధికారులు ఫిర్యాదుదా రున్ని అల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రొటెక్షన్ కోరాల్సిందిగా సూచిం చారు. అక్రమంగా వేసినారు బోర్లను
సీజ్ చేసేందుకు రెవెన్యూ అధి కారులు సుముఖంగా ఉన్నప్పటికీ పోలీ సులు మాత్రం రెవెన్యూ అధికారు లకు సహకరించకపోవడం పోలీసు అధి కారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. గత ప్రభుత్వంలో అధికా రపక్షం వారికి పూర్తి మద్దతు తెలిపిన పోలీసు అధికారులు ప్రస్తుతం ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోక పోవడం బట్టి చూస్తే ఇంకా ఈ రాష్ట్రం
లో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికా రంలో ఉన్నట్లు భ్రమలో ఉన్నారన్న సందే హం వ్యక్తం అవుతుంది.ఇప్పటికైనా సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చసి అక్రమంగా బోర్లు వేసిన వారిపై చర్యలు తీసుకున్నందుకు ఆదేశాలు జారీ చేయాలని బాధితులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version