బి ఆర్ ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
– మెదక్ బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి
రామాయంపేట(మెదక్) నేటి ధాత్రి.
కాంగ్రెస్ పార్టీ నమ్మితే నట్టేట్లో మునిగినట్లు అవుతుందని, బి ఆర్ఎస్ కి ఓటేస్తే అభివృద్ధి బాటలో నడుస్తామని మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు . రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గొల్పర్తి, కోమట్పల్లి, కోమటిపల్లి తండా, రామయంపేట తండాలో శనివారం బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు బోనాలు, డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నియోజకవర్గంలో మెదక్ తో పాటు రామయంపేట పట్టణం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల ద్వారా రూ.45 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. ఎన్నో వెళ్లగా కలగా మిగిలిపోయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. బి ఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెపుతూ ప్రజలను మోసం చేస్తుందని ఆ పార్టీ చెప్పే మాయమాటలకు మోసపోవదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమలు చేపట్టడం జరిగిందని అన్నారు. పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు పెళ్లిళ్లు చేయడం భారంగా మారుతుందని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణి లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ లో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే రూ.2,000 పెన్షన్ లో రూ.1,100లు గ్యాస్ సిలిండర్ కి పోతున్నాయని ఆలోచించి గ్యాస్ సిలిండర్ ధరను రూ.400 లకు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని,రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అంటుండగా, ఉత్తంకుమార్ రెడ్డి రైతుబంధు నిలిపి వేయాలని అంటున్నాడని ఆరోపించారు.డ్వాక్రా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం తీసుకు వచ్చినట్టు తెలిపారు.
ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్. బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు గ జవాడ నాగరాజు. వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి. పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం. కౌన్సిలర్లు సుందర్ సింగ్. డేమే యాదగిరి. టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.