నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా అమ్మితే జైలు శిక్ష చట్టపరమైన చర్యలు జిల్లా ఎస్పీ

రావుల గిరిధర్

వనపర్తి నేటిధాత్రి :
*వనపర్తి జిల్లా పట్టణ ములో చైనా మంజా నిషేదం ఉన్నదని
జిల్లా ఎస్పీ ఆర్ గీరీదర్ ఒక ప్రకటన లో విలేకరులకు తెలిపారు

వనపర్తి జిల్లాపట్టణ ములో చైనా మాంజ పై నిషేధం విధించడం జరిగిందని, జిల్లాలో ఎవరైనా చైనా మంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రావుల గిరిధర ప్రకటనతో తెలిపారు.
సంక్రాంతి పండగ సంద‌ర్భంగా చైనా మాంజ ఎక్కువ‌గా విక్ర‌యించే దుకాణాల పై పోలీసులు అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని, నైలాన్, సింథటిక్‌ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో పర్యవరణానికి విపత్తుగా మారడంతో పాటు చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ,చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. చైనా మాంజ‌ను ఉప‌యోగించి గాలి ప‌టాలు ఎగుర‌వేసే క్రమంలో ఎన్నో ప‌క్షులు, సాధారణ ప్రజలు కూడా ప్ర‌మాదానికి గురవుతారు. అదే క్ర‌మంలో గాలిప‌టాలు ఎగుర‌వేసే వ్య‌క్తులు కూడ ప్ర‌మాదానికి గురైన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చైనా మంజా నిషేదించాం అని ఎస్పి తెలిపారు. చైనా మాంజాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది అని ఎస్పీ తెలిపారు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా కూడా వుంటుంది అని తెలిపారు. జిల్లా పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకొవడం జరుగుతొందని ప్రధానంగా ప్రజలు సైతం చైనా మాంజా వినియోగించకుండా ఎవరికి హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలని, అలాగే ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న డయల్‌ 100 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలనీ జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version