పదవీకాలం ముగియడంతో సర్పంచ్ దంపతులకు సన్మానం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల సర్పంచ్ గోనె సుమలత, నర్సయ్య పదవి కాలం ముగియడంతో సోమవారం రోజున గ్రామంలోని కమ్యూనిటీ హాల్ లో ఉప సర్పంచ్ లక్ష్మి, నర్సయ్య 12, మంది వార్డ్ మెంబర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది కో ఆప్షన్ మెంబర్స్ బల్ల రజెల్లు, ఏస్కూరి రఘునాథ్, మాజీ సర్పంచ్ లను, మాజీ ఎంపీటీసీ లను గ్రామ పెద్దలు వరికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా మాజీ సర్పంచ్ గోనె సుమలత,నర్సయ్య దంపతులను గజమాలతో సత్కరించి, వాళ్ళ చిత్రపటాన్ని వారికి బహూకరించారు. సర్పంచ్ సుమలత మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో గ్రామానికి చేసిన సేవలు, ఎన్నొ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామని గుర్తు చేశారు. అలాగే పదవి లేకపోయినా ఎప్పటిలాగే గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారికి తోడుగా ఉంటూ గ్రామ అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తూ ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ బడుగు రవి, పి ఎ సి ఎస్ చైర్మన్ గుండు తిరుపతి,ఎక్స్.సర్పంచ్ లింగమ్మ, ఎక్స్ ఎంపీటీసీ మారుతి కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version