హలో మాదిగ చలో ఈదుముడి కరపత్రాలు ఆవిష్కరణ

గొల్లపల్లి నేటి ధాత్రి:

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) మాదిగ రాజకీయ పోరాట సమితి (ఎం పి ఎస్) మహాజన పోరాట సమితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బి ఎన్ రమేష్ కుమార్ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ ఏ బి సి డి రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై జులై 7న మాదిగల పుణ్యక్షేత్రం ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం ఈదు ముడి గ్రామంలో జరగబోయే మాదిగల మహా జాతరను విజయవంతం చేయుట కొరకు గొల్లపల్లి మండల అధ్యక్షుడు చెవులమద్ది సంతోష్ మాదిగ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెవుల మద్ది శ్రీనివాస్ మాదిగ ముఖ్య అతిథిగా వచ్చి హలో మాదిగ చలో ఈదుముడి కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెవుల మద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ 1994 మాదిగల హక్కుల గురించి అలుపెరుగని పోరాటంతో ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలైన మాదిగల చిరకాల కోరిక అయిన ఏ బి సి డి వర్గీకరణ కోసం ఎందరో మాదిగలు అశ్రులు బాసిన మాదిగలు వర్గీకరణ కోసం ఇప్పటిదాకా నిరంతరం ఉద్యమం చేస్తున్న నాయకులైన అంతిమ లక్ష్యం వర్గీకరణ బిజెపి ప్రభుత్వం 2014 లో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులలో వర్గీకరణ చేస్తామని మాట తప్పి మళ్లీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నక్క వినేష్, చెవుల మద్ది గంగాధర్, చెవులమద్ది రాజయ్య, చెవుల మద్ది పోచయ్య, కొండ్ర చంద్రయ్య, నక్క గంగయ్య, గంగమల్లు, రమేష్, పోచయ్య, ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version