అతిథి అధ్యాపకులను రెన్యువల్ చేయాలి

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి
ఇంటర్ బోర్డు అధికారుల తప్పిదం వల్ల పలువురు అతిథి అధ్యాపకులను ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని, వెంటనే వారిని రెన్యువల్ చేయాలని ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బరిగెల నారాయణ కోరారు.

అతిధి అధ్యాపకుల రెన్యువల్ సమస్యపై శనివారం డివిజన్ కేంద్రంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ…..

అతిధి అధ్యాపకుల రెన్యువల్ వ్యవహారంలో ఇంటర్ బోర్డు రాష్ట్ర ఫైనాన్స్ విభాగం కు తప్పుడు జాబితా ఇచ్చిందని, దానివల్ల 65 మంది అతిథి అధ్యాపకుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. జీవో నెంబర్ 1219 లో ప్రస్తుతం పని చేస్తున్న పోస్టులను చూపించ లేదన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆగస్టు వరకు పనిచేసిన పలువురు అతిధి అధ్యాపకుల ను రెన్యువల్ చేయకపోవడం సరికాదన్నారు. బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల పలు సబ్జెక్టులు బోధించేందుకు అధ్యాపకులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అధ్యాపకులకు జరిగిన అన్యాయంపై ఇంటర్ బోర్డు కమిషనర్ జెడి ఆర్జెడి అధికారులను కలిసినా న్యాయం చేయకపోవడం సరికాదన్నారు. పలువురు అధ్యాపకులను రెన్యువల్ చేయకపోవడం వల్ల ఆయా సబ్జెక్టుల తరగతులు నిలిచిపోయాయన్నారు. సబ్జెక్టు బోధించేవారు లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ బోటనీ ఎకనామిక్స్ జువాలజీ సబ్జెక్టులు సాంక్షన్ పోస్టులు అయినప్పటికీ ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఫైనాన్స్ అప్రూవల్ లేదని అధికారులు చెప్పడం భావ్యం కాదన్నారు. తొర్రూరు కళాశాలలో ఫిజిక్స్, బాటని గెస్ట్ లెక్చరర్ లను వెంటనే రెన్యువల్ చేయాలన్నారు.
బోర్డు అధికారుల తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, వెంటనే అతిధి అధ్యాపకులను అందరినీ రెన్యువల్ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శివరామకృష్ణ, అలీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version