వీణవంక ,(కరీంనగర్ జిల్లా)
నేటిదాత్రి:వీణవంక మండల కేంద్రంలోని 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ తిరుమల్ రావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ ,పోలీస్ స్టేషన్లో ఎస్సై వంశీకృష్ణ, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి , గ్రామపంచాయతీలో సర్పంచ్ నీల కుమారస్వామి, మోడల్ స్కూల్ ఘనుక్లలో ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి, అన్ని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలలో
జాతీయ పతాక ఆవిష్కరించారు. అలాగే వీణవంక గ్రామంలో కురుమవాడలో నీల ముండయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతి ప్రధానోత్సవము విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుకా తిరుపతిరెడ్డి వైస్ ఎంపీపీ లత శ్రీనివాస్, జడ్పిటిసి వనమాల సాధవరెడ్డి ,ఎంపిటిసిలు నల్ల మమత తిరుపతి రెడ్డి, రజిత, సవిత, డిప్యూటీ తాసిల్దార్ నిజాముద్దీన్, ఉప సర్పంచ్ భానుచందర్, నీల మొండయ్య,అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.