మజిద్ ఏ కౌసర్ లో ఘనంగా బక్రీద్ వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మజీద్ ఏ కౌసర్ ఆవరణలోని ఈద్గాలో చిట్యాల చుట్టూ ప్రక్కల గ్రామాలైన నవాబుపేట ఏఆర్ పల్లి సి.ఆర్ పల్లి తిరుమలాపూర్ గ్రామాలకు చెందిన దాదాపు 150 మంది ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకున్నారు. ఈ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ లలో బక్రీద్ పండుగ ఒకటి ఈ పండుగ త్యాగానికి సహనానికి ప్రతీకగా నిలుస్తుందని మహమ్మద్ ప్రవక్త బోధనలను పాటించాలని సాటివారిపై దయా కరుణ చూపాలని ఈ పండుగ యొక్క విశ్వాసం తమకు ఉన్నదాంట్లో ఇతరులకు పంచి పెట్టే దాతృత్వం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని మహమ్మద్ ప్రవక్త బోధనలనుఆయన తెలియజేశారు ఈ సమావేశంలో మజీద్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ అజ్మత్ మియా జనరల్ సెక్రెటరీహైదర్ పాషా ఉపాధ్యక్షులు షఫీ పాషా జాయింట్ సెక్రెటరీ అక్బర్ ట్రెజరర్ షేక్ హుస్సేన్ కమిటీ సభ్యులైన శంషుద్దీన్ ఆటో అంకుష్ మునీర్ సాజిద్ ఉమ ఫ్ ఆరిఫ్ సలీం జలీల్ యూసుఫ్ అంకుసు మొదలగు వారు పాల్గొని ఆ లింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version