తుప్పు పడుతున్న గ్రామ పంచాయతీ చెత్త తరలింపు బండ్లు!!

మరమ్మతులు చేయించి వాడుకుంటే ఉపయోగం అంటున్న ప్రజలు!!
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలో గ్రామపంచాయతీ సంబంధించిన చెత్త తరలింపు బండ్లు ,ఏదైనా మరమ్మతులకు నోచుకుంటే అవి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉండాలి కానీ అవి బస్టాండ్,సమీపంలో సంవత్సరాలకొద్దీ మూలన పడి ఉంటున్నాయి అని ఒకవైపు ప్రభుత్వం స్వచ్ఛభారత్ కింద స్వచ్ఛ సర్వేక్షన్ వివిధ కార్యక్రమాలు చేపడుతూ పరిశుద్ధ కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వం చేస్తుంటే కిందిస్థాయి అధికారులు వాటిని మరచి మరమ్మతులు చేయకుండా సంవత్సరాల కొద్దీ చెత్త తరలింపు బండ్లు బస్టాండ్ ప్రక్కన మూలాన పడి ఉండడం చూస్తే అధికారుల నిర్లక్ష్యం కన బడుతుందని, ఈ సంఘటన చూసి గ్రామస్తులు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ గ్రామాలుగా చేయడమే ధ్యేయంగా చెత్త తరలింపు కొరకు ప్రభుత్వ నిధులతో వివిధ చెత్త తరలింపు బండ్లు కేటాయిస్తే, అధికారుల నిర్లక్ష్యం వల్ల మరమ్మతులకు నోచుకోకుండా ఎండకు ఎండుతూ వానకు నానుతూ వాటి భాగాలు తుప్పు పడుతూ వృధాగా ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపించి చెత్త తరలించేందుకు వీటిని వాడుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *