గత 25 సంవత్సరాలుగా ఎస్టీ బోగస్ కుల దృవీకరణ పత్రంతో లబ్ధి పొందిన గీదా కోదండ రామయ్య పై ప్రభుత్వం చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే.

భద్రాచలం నేటి ధాత్రి

(Jac) చైర్మన్ పాయం

మంగళవారం నాడు చర్ల మండల కేంద్రం భద్రాద్రి డిగ్రీ కళాశాలలో ఆదివాసి సంఘాల సమన్వయ కమిటీ జేఏసీ సభ్యుల సమావేశం జరిగినది
ఈ యొక్క సమావేశంలో జాక్ చైర్మన్ పాయం సత్యనారాయణ మాట్లాడుతూ చర్ల మండల కేంద్రానికి చెందిన గీద కోదండ రామయ్య 1988 సంవత్సరంలో స్కూల్ రికార్డును టాపరింగ్ చేసి ఎస్ టి గా నమోదు చేయించి మూడుసార్లు సర్పంచ్ గా పోటీ చేసి గెలిచి మరియు రెండుసార్లు ఎంపీపీగా ఎన్నికై ప్రభుత్వాలను మోసం చేస్తూ పదవిని అడ్డుపెట్టుకొని అనేక రాజకీయ పదవులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ రాజా లాగా రాజభోగాలు అనుభవించిన సదరు వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు
షెడ్యూల్ ప్రాంతాలలో విచ్చలవిడిగా రెవెన్యూ అధికారులు కొంతమంది గిరిజ నేతరులకు ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారని అన్నారు హెల్త్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు అనుభవిస్తున్న వారు పై కూడా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క కార్యక్రమంలో నాయక పోడు సేవా సమితి సంఘం రాష్ట్ర కార్యదర్శి పున్నం రామకృష్ణ సీనియర్ ఆదివాసి నాయకులు మాజీ ఎంపీపీ గొంది ముయ్యన్న. సీనియర్ ఆదివాసి కుల పెద్ద సున్నం సుబ్బయ్య తుడుందెబ్బ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాటి లక్ష్మణరావు. ఆదివాసి గిరిజన విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు ఈర్ప ప్రకాష్ నీలం రమణయ్య పూజారి ఆదినారాయణ కుల పెద్ద పూజారి కొండబాబు జిఎస్ పి వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ గొంది లీలా ప్రసాద్ యాక న బ్రోరసింహారావు పాయం సన్యాసి తోలం రామకృష్ణ. ఇ ఇర్ప శరత్,కోరం. బిట్టు, కణితి. భానుప్రకష్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version