ఆపసోపాలు పడుతూ ప్రభుత్వ హాస్పిటల్ ను నెట్టుకొస్తున్న వైద్య సిబ్బంది..
అత్యుత్తమ సేవలు అందిస్తున్న పి.హెచ్.సి.లో కనీసం వసతులు కరువు
చాలి చాలని వసతులతో,సిబ్బంది కొరత ఉన్నా కూడా వైద్య సేవలలో ముందుకే…
హాస్పిటల్ కు వచ్చే రోగులకు మాత్రం మూగ జీవాల బెడద తప్పడం లేదు.
కాంపౌండ్ వాల్ లేక,మార్కెట్ మాంసాకృతులను నేరుగా హాస్పిటల్ లోకి తెస్తున్న మూగ జీవాలు
వైద్య సేవల్లో ఉన్న వసతులతో ముందున్న వైద్యం కోసం వచ్చే రోగులకు మాత్రం దుర్వాస తప్పడం లేదు..
నేటిధాత్రి ,భీమాదేవరపల్లి, సెప్టెంబర్16 :
2006 సంవత్సరం నుండి ముల్కనూర్ లో ప్రజలకు ప్రైమరీ చికిత్స అందిస్తూ చాలి చాలని వసతులతో ఉండి లేని సిబ్బంది తో కాలమెల్లతీస్తూ వైద్య సేవలో తమదైన ముద్ర వేస్తున్న భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తూ జిల్లాలోనే గుర్తింపు పొందిన వాటిలో ఒకటై ఉంది. కానీ జిల్లాలోనే ఇప్పటివరకు ప్రహరీ గోడ లేని పిహెచ్సిగా గుర్తింపు సంతరించుకుంది.వైద్యం కోసం హాస్పిటల్ కు వచ్చే రోగులకు లోపలికి రాగానే గుప్పు గుప్పు మంటూ దుర్వాసన, మూగజీవాలు దర్శనమిస్తాయి. హాస్పిటల్ చుట్టూ కాంపౌండ్ వాల్ లేక ముందున్న మార్కెట్ యొక్క వ్యర్ధాలను,మాంసాకృతులను లోపలికి తీసుకొస్తున్న మూగజీవాలు. ఏళ్లు గడుస్తున్నా ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీ గోడ కట్టించే నాధుడే కరువాయే. ఇదిలా ఉంటే చాలీచాలని సిబ్బందితో జిల్లాలోని అత్యుత్తమ సేవలు అందిస్తున్న పీహెచ్ లలో ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకటి.ఇప్పటి కూడా మండలానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ముల్కనూర్ పి.హెచ్.సి.లో కేవలం ఒకే ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు.కనీసం మొన్న జరిగిన బదిలీల్లో నైనా ఒక ల్యాబ్ టెక్నిషన్ వస్తాడు కావచ్చు అనుకుంటే అది లేదు.ఉన్న వాళ్ళతోనే హాస్పిటల్ లో కాలం ఎల్లదిస్తున్న పరిస్థితి. అయిన వైద్యం కోసం వచ్చే వారికి మాత్రం తక్షణ చికిత్స లో ముందుండడం హర్షణీయం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలుమార్లు కాంపౌండ్ వాల్ కొరకై అధికారులకు విన్నవించిన మోక్షం కలగలేదు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే నే మంత్రి కావడం మంత్రి పొన్నం ప్రభాకర్ అయినా చోరవ తీసుకొని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పట్టించుకోని వెంటనే హాస్పిటల్ చుట్టూ ప్రహరీ గోడను కట్టించి బయట నుండి వచ్చే వ్యర్ధాలను, మూగజీవాలను అరికట్టేలా చూడాలని మండల ప్రజానీకం, హాస్పిటల్ కు వచ్చే రోగులు ఆకాంక్షిస్తున్నారు.
ఈ విషయంకై మెడికల్ ఆఫీసర్ ను వివరణ కోరగా
గతంలో కరోన సమయంలో నేను ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మెడికల్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో అప్పటి అధికారులకు కాంపౌండ్ వాల్ కొరకై అర్జీ పెట్టాను. అప్పుడు ఎస్టిమేషన్ దాదాపు 30 లక్షలు రూపాయలు దాకా వచ్చింది. తర్వాత బదిలీపై నేను ఎంజిఎం హాస్పిటల్ కు వెళ్లాను. మొన్న జరిగిన బదిలీలలో తిరిగి ముల్కనూర్ హాస్పిటల్ కు ట్రాన్స్ఫర్ పై వచ్చిన తరువాత ఈ సమస్యపై తీవ్రతను మా అధికారులకు వివరించాను. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామన్న అధికారులు అంటూ తెలిపిన ముల్కనూర్ మెడికల్ ఆఫీసర్ ప్రదీప్ రెడ్డి వివరణ తెలిపారు.

