ఆదర్శ క్లబ్ నూతన భవనాన్ని ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఆదర్శ క్లబ్ నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ వి ప్ ఆది శ్రీనివాస్ ఆయన మాట్లాడుతూ వివేకానందుని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తే అక్రమాలకు చెక్ పెట్టవచ్చని తెలియజేస్తూ గత ప్రభుత్వం మండలంలో ఉన్న ప్రభుత్వ భూమిని బిఆర్ఎస్ పార్టీ లీడర్లు అలాగే పేదల భూములను రాబందులుగా లాక్కున్నారని గత పది సంవత్సరాలు గంజాయి అక్రమ భూ దందాలు ఎక్కువ దోపిడి జరిగింది తంగళ్ళపల్లి మండలంలోని అలాగే ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీలోనే భూ పంపిణీ జరిగిందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు ప్రభుత్వ భూముల సర్వేకు శ్రీకారం చుట్టారని ప్రభుత్వ భూములు తీసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుందని గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ నాయకులు చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని ప్రభుత్వ భూములు దోచుకున్నారని లావన్ అసెండ్డ్ భూములన్ని బి ఆర్ ఎస్ ఖాతాలోకి వెళ్ళాయని రైతుబంధు డబ్బులను రాబందుల దోచుకున్నారని కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో క్లబ్బు పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version