గుల్లకోటలో రెండు బోర్లు వేయించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!!!

కృతజ్ఞతలు తెలిపిన గ్రామ ప్రజలు!!
ఎండపల్లి నేటి ధాత్రి
నీటి సమస్య పరిష్కారం కొరకు తన సొంత నిధులతో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రెండు బోర్లు వేయించారు,ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో మున్నయ్య పల్లె,మరియు పద్మశాలి వాడలో ఉన్న నీటి సమస్యను గుర్తించి,గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ శ్రేణులు, నీటి సమస్యను గుర్తించి ఇట్టి నీటి సమస్యను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిసగొని సత్యం గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే రెండు బోర్లు వేయించడం జరిగింది,, సమస్య ఉందని చెప్పగానే వెంటనే పరోక్షంగా ప్రత్యక్షంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి, మరియు పిసిసి కార్యవర్గ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూసారపు భూమయ్య, సీనియర్ నాయకులు గొల్లపల్లి మల్లేశం, శంకరయ్య గౌడ్ ,యూత్ అధ్యక్షులు గోనె సురేష్, నాయకులు గోనె సంతోష్ గుండ మహేష్ కడమండ ప్రేమ్ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version