వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో బ్రాహ్మణవాడలో శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు గోదాదేవి పల్లకి సేవ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు పూరి పాండు నిర్వాహకులు 15వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పూరి బాలరాజ్ పాపిశెట్టి శ్రీనివాసులు వలకొండ జగదీష్ కోట్ర నరసింహ కొంపల బాలచంద్రుడు ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు ఆలయ పురోహితులు రామకృష్ణ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు గోదాదేవి అమ్మవారి పల్లకి సేవ అష్టోత్తరం పూజలు ఉంటాయని వారు పేర్కొన్నారు భక్తులు శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో పాల్గొని పాండురంగ స్వామి గోదాదేవి అమ్మవారి అనుగ్రహం పొందాలని వారు కోరారు భక్తులు జర్నలిస్టు నాగబంది వెంకట్ రమణ క్రాంతి ట్రాన్స్ పోర్టు నుకల విజయ హరి నాథ్ అలుగడ్డ శ్రీనివాసులు కొండ విశ్వనాథం లగిశెట్టి చక్రవర్తి భక్త్తులు పాల్గొన్నారు
