శబరికి బయలుదేరిన అయ్యప్ప స్వాములు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములకు ఇరుముడి కోసం మండలంలో గల అయ్యప్ప స్వామి భక్తులు నియమ నిబంధనలతో ఉపవాసాలు ఉంటూ 41 రోజులపాటు అయ్యప్ప స్వామి కఠోర దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమాన్ని వైభవంగా పూర్తి చేసుకున్నారు .శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో అయ్యప్ప విగ్రహం ఏర్పాటు చేసి ప్రకాష్ గురు స్వామి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములకు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అయ్యప్ప స్వాములు శబరిమలకు తరలి వెళ్లారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి గురు స్వాములు జిన్నా ప్రతాప్సేనారెడ్డి వలుపదాసు చంద్రమౌళి సామల రవీందర్ దిడ్డి రమేష్ బొల్లపల్లి సదానందం శ్రీధర్ రెడ్డి గట్టు కిషన్ మార్త సుమన్ గోరంటల ప్రశాంత్ ఉప్పునూతల ప్రసాద్ ప్రదీప్ ప్రవీణ్ మాల ధరించిన అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.