బాలికలు లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి

ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం

బాలిక దినోత్సవ నినాదాలతో మారుమోహిన ఎన్ఐటి ఆడిటోరియం

ఉత్తమ ఫలితాలు సాధించే పది, ఇంటర్ బాలికలకు లక్ష చొప్పున నగదు ప్రోత్సాహం

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

 

నేటిధాత్రి:హన్మకొండ

బాలికలు లక్ష్య సాధన దిశగా కృషి చేసి భవిష్యత్ దిశా నిర్దేశం చేసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు, జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో
జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్ఐటి) ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలు జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ అధ్యక్షతన జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బాలికలు లక్ష్య సాధనలో అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సిన పరిస్తితి వస్తుందని అయితే వాటిని సవాల్ గా స్వీకరించి అవరోధాలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను సాధించి ఆదర్శంగా నిలవాలని అన్నారు.

వచ్చే విద్యాసంవత్సరంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించబోయే వారికి తన జీతంలో లక్ష రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహాన్ని అందిస్తానాని హామీ ఇచ్చారు

చదువును నిర్లక్ష్యం చేయకుండా ఉన్నతమైన ఆశయాలతో ఉన్నతమైన విలువలతో ఎదగాలను ఆకాంక్షించారు

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ బాలికలందరికి ముఖ్యంగా సమాజానికి సావిత్రిబాయి ఫూలే ఆదర్శనీయమని, ఎన్నో అవరోధాలను అధిగమించి స్త్రీ విద్యకు పునాది వేసిందని, తన జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని జీవితంలో ఎదురయ్యే సమస్యలను చదువు అనే ఆయుధంతో సాధించవచ్చని, నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది ఐఎఎస్ అధికారులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని అందులో నేను ఒక్కరిని అని, ప్రణాళికా బద్దంగా చదివి ఈ స్థాయిలో ఉన్నామని. బాలికలు ఆ దిశగా కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థానంలో నిలుస్తారని అన్నారు.

బాలికా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా నిరంతర వారి సంక్షేమం రక్షణ కోసం ప్రభుత్వ శాఖల అధికారులు కృషి చేయాలని, గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీలు ఎప్పటికప్పుడు బాలిక సాధికారత కోసం కృషి చేసినప్పుడే బాలికల జీవితాల్లో నిజమైన ఆనందం కనపడుతుందని అన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ మాట్లాడుతూ
జిల్లాలోని మూడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధి మండలాలు గ్రామాలల్లో కమిటీలను బలోపేతం చేసి బాలల న్యాయ చట్టం మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ చట్టంపై గ్రామీణ పట్టణ మండల జిల్లా స్థాయిలో వివిధ రూపాలలో అవగాహన కల్పిస్తున్నామని పోలీస్, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ, మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించి బాలిక సంరక్షణ కోసం కృషి చేస్తామని అన్నారు.

కార్యక్రమంలో బాలసదనం, రీచ్ సంస్థల బాలికలు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. కాగా జిల్లా రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనపరచిన వివిధ కస్తూర్బా బాలికల పాఠశాల ఐదుగురు విద్యార్థినులకు, మరియు మహిళా శిశు, బాలికా సాధికారత కోసం కృషి చేసిన మహిళా అధికారులు, అధికారులకు ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డుతో సన్మానించడం జరిగింది.
కార్యక్రమంలో కాజీపేట ఏసిపి డేవిడ్ రాజ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సందసాని రాజేంద్ర ప్రసాద్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఈసి మెంబర్ ఈవీ శ్రీనివాస రావు, స్థానిక కార్పొరేటర్లు మామిడాల రాజు, మానస రాంప్రసాద్,
సిడిపివో స్వరూప,
జిల్లా మిషన్ కో ఆర్డినేటర్ డి కళ్యాణి, డీసిపివో పి సంతోష్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్. సీనియర్ సహాయకులు వి వెంకట్ రామ్,
స్వర్ణ, లావణ్య, మాధవి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు రాజ్యలక్ష్మి, శిరీష, కవిత, రాజ్యలక్ష్మి, బాలసదనం సూపరింటెండెంట్ కళ్యాణి, సఖి, మరియు వివిధ శాఖల అధికారులు,అంగన్వాడి టీచర్లు, సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల గిరిజన ఆశ్రమ పాఠశాల, పింగిలి ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version