ట్రైబల్ వెల్ఫేర్ తునికి బండల పాఠశాలకు స్మార్ట్ టీవి బహుకరణ

హెడ్ మాస్టర్ ఇస్లావత్ నరేష్ హర్షం వ్యక్తం చేశారు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ లో జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న కుమారస్వామి,అంజలి దంపతుల కుమార్తె ఉషా,రామ్ ఆస్ట్రైలియా లో స్థిర నివాసం ఉన్నపటికీ వారి కుమారుడు విశ్వమహాదేవ్ మొదటి పుట్టినరోజు సందర్బంగా అరుణ, హీర్యా సహకారంతో ఆళ్లపల్లి మండలం తునిబండల పాఠశాలకు 50,000 విలువ గల స్మార్ట్ టీవి ని బహుకరించారు. ఇలా గిరిజన పిల్లలకు ఈ విధంగా సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కుమారస్వామి మాట్లాడుతూ మీరు చదువులో మంచి శ్రద్ద కనబరిస్తే మీకు త్వరలో ఇంకో బహుమానం ఇస్తా అని పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చారు. హీర్యా అరుణలు కూడా పిల్లలకు వారి ఆశీస్సులు అందజేశారు. పాఠశాల హెడ్ మాస్టర్ ఇస్లావత్ నరేష్ హర్షం వ్యక్తం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి హాతీరాం, సీఆర్ పి రామయ్య, ఎస్ఏంసి చైర్మన్ సమ్మయ్య, నాగమణి లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version