కాటారం నేటి ధాత్రి
కాటారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గంగారం ఆయుష్మాన్ ఆరోగ్యం కేంద్రాన్ని ఏ ఎస్ ఓలా బృందం సందర్శించి పర్యవేక్షించారు ఈ ఆరోగ్య మందిరంలో ప్రతిరోజు నిర్వహించే వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు
ఆశాలు ద్వారా నిర్వహించే సేవల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు
మాతా శిశు సంరక్షణ సేవల గురించి మరియు చిన్నపిల్లల వ్యాధుల నివారణ టీకాల గురించి టీ బి వ్యాధి గురించి సీజనల్ వ్యాధుల గురించి షుగరు మరియు బిపి వ్యాధుల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రజలకు సరియైన మందులు అందుతున్నాయా బీపీ షుగర్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారా వారికి సకాలంలో మందులు అందుతున్నాయా. పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు ఏఎన్ఎం ద్వారా షుగరు మరియు బీపీ పరీక్షలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్శన కార్యక్రమంలో ఏ ఎస్ ఓ లు హిమాన్ష్ నిషాన్ సింగ్ నీరజ్ కుమార్ వివేక్ కుమార్ మరియు గంగారం డాక్టర్ సుమన్ ఏఎన్ఎం రజిని.కర్నాకర్, వెంకన్న,ఆశా కార్యకర్తలు రజిత,కవిత,కాంత, స్వరూప పాల్గోన్నారు