ఇందిరానగర్ సంక్షేమ సంఘం మరియు యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు…
పాల్గొన్న సిపిఐ పార్టీ మేడిపల్లి మండల ప్రధాన కార్యదర్శి రచ్చ కిషన్…
మేడిపల్లి(నేటీదాత్రీ):
విఘ్నాలను తొలగించే దేవుడు అందరికంటే ముందుగా పూజలు అందుకునే ఆది దేవుడు ఏకదంతుడే అని సిపిఐ పార్టీ మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్ అన్నారు. బోడుప్పల్, ఇందిరానగర్ కాలనీ పరిధిలో ఇందిరా నగర్ కాలనీ సంక్షేమ సంఘం మరియు ఇందిరా యూత్ క్లబ్ నిర్వహించిన వినాయక మండపం దగ్గర గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి కార్యక్రమం ప్రారంభించిన తొలి పూజ గణనాథుడికే అగ్ర పూజ అందుకునే దేవుడు విఘ్నాలను తొలగించే వినాయకుడె అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరా యూత్ క్లబ్ అధ్యక్షులు పారుపల్లి అనిల్ కుమార్, యూత్ సభ్యులు సతీష్ , రాజేష్ చారి, ప్రశాంత్, ప్రవీణ్ చారి, శ్రీనివాస్, అరుణ్ రెడ్డి, సూర్యధర్ చారి, నవతేజ్ చారి, తదితరులు పాల్గొన్నారు.