గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపే లక్ష్యం

బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 11

భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపే లక్ష్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు నేతృత్వంలో మండలంలోని రంగాపురం గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ..ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్..ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత దేశానికే ఆదర్శవంతమైన పథకాలను తీసుకొచ్చి..దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భవింపజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి సీఎంను చేయాలంటే..గండ్ర వెంకట రమణారెడ్డిని భూపాలపల్లి లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పోలినేని రాజేశ్వర్ రావు, నాయకులు, ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version