నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ)జాతిపిత మహాత్మా గాంధీ 76 వ వర్ధంతి నీ పురస్కరించుకొని కమలాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ వర్ధంతి నీ జరుపుకున్నారు.మండల కేంద్రంలో గల వైశ్య సంఘం భవనం వద్ద గల గాంధీ ప్రతిమకు మొదట పాలాభిషేకం నిర్వహించి,పూల మాలంకృతం చేశారు. ఘన నివాళి అర్పించారు.అనంతరం సభ్యులందరూ ఆయన మృతికి సంతాపం సూచకంగా మౌనం పాటించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కొనిషేట్టి మునింధర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర ఉన్నతమైనది అన్నారు.శాంతి,అహింస సిద్దాంతం అనుచరించి మహాత్ముడు దేశానికి స్వాతంత్య్రం సముపార్జించాడని కొనియాడారు.ప్రపంచ వ్యాప్తంగా శాంతి దూత,బాపూజీ,భారత జాతిపిత అని కొని యాడితున్న గాంధీ చివరకు ఒక భారతీయుడి తూటాలకు బలి కావడం బాధాకరం అని అవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమములో పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు కొనిశెట్టి మునిందర్,ప్రధాన కార్యదర్శి వెనిశెట్టి పున్నం చందర్,కోశాధికారి నం గునూరి సాగర్ బాబు,మండల సంఘం ప్రధాన కార్యదర్శి సుద్దాల కార్తీక్,నాయకులు నూక వీరభద్రయ్య,వెనిషేట్టి విజయ్ కుమార్,దొడ్డ రమేష్,భూపతి శివశంకర్,రఘురాం,మాడిషెట్టి రమేష్,సంపత్,రాజేందర్, నూక రమేష్,శ్రీదరా చారీ, తదితరులు పాల్గొన్నారు.