చేతి గుర్తుపై ఓటు వేసి గడ్డం వంశీని గెలిపించాలి.

మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం కొలనూర్ గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్లి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పెద్దపెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ మరియు మాజీ PACS చైర్మన్ గోపు నారాయణ రెడ్డి కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ విజయరామన రావు నాయకత్వంలో ఎ గ్రామానికి వెళ్లిన ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు తప్పకుండా ఈసారి తమ ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కు వేస్తామని ప్రజలు చెప్తున్నారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమ్ముల మల్లయ్య , గాజుల శివశంకర్ , గడ్డం బన్నీ కాసారపు శ్రీనివాస్ గౌడ్,కందుల సదాశివ్,కందుల అశోక్,గుండేటి శ్రీకాంత్,జంగం కొమురయ్య ,సుధాకర్,మహిళలతో తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version