సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:- గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నల్లగండ్ల గ్రామం లో ఇరవై లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యతా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని కార్పొరేటర్ గారు ఆదేశించారు. వర్షపు నీరు,మురుగు నీరు, ఎక్కడ కూడా నిలవకుండా చూస్తామని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ శ్రీ గంగాధర్ రెడ్డి ఆదేశించారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రతి కాలనీ,బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్ని అన్నారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు..ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు.అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నల్లగండ్ల గ్రామం వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏఈ సునీల్ వర్క్ ఇన్స్పెక్టర్ లక్సమాన్ సీనియర్ నాయకులు గిరి,చందు, కాలనీ వాసులు, స్థానిక నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version