ఏలేటి రాజారాంపటేల్ జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

ఎండపల్లి జగిత్యాల నేటిధాత్రి
ఎండపల్లి మండలం రాజారాం పల్లె గ్రామం లో ఏలేటి రాజారాం పటేల్ 179 వ జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం నేడు రాజారాంపల్లి లోని గ్రామపంచాయతీ ఆవరణలో కరీంనగర్ కు చెందిన శివకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు, ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మహేశ్వర్ రెడ్డి , ఫిజిషియన్, డాక్టర్ ప్రత్యూష రెడ్డి ,ఎండి ఫీజిషియన్. వారి బృందంతో ప్రజలు వైద్య పరీక్షలు షుగర్ బిపి రక్త పరీక్షలు ఈసీజీ కూడా నిర్వహించారు. ఈ వైద్య శిభిరంకు రాజారాం పల్లె గ్రామం నుండి కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వారి వారి సమస్యలు డాక్టరు దగ్గరికి వెళ్లి సలహా తీసుకుంటూ వారి సేవలను పొందారు, వైద్య శిభిరాన్ని వినియోగించుకున్నారు,ఈ వైద్య శిభిరం లో మొత్తం 125 మందికి గాను,ఉచితంగా శివ కృష్ణ మల్టీ స్పెషాలిటీ కరీంనగర్ వారి బృందం సేవలు అందించారని నిర్వాహకులు తెలిపారు, అనంతరం రాజారాం పటేల్ విగ్రహానికి వారి కుటుంబ సభ్యులు , ప్రజా ప్రతినిధులు అధికారులు పూలమాలవేసి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని అభిమానులు అన్నారు. కార్యక్రమంలోఎంపీడీవో సంజీవ రావు,తహశీల్దార్ ఉదయ్ కుమార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంగల కరుణాకర్ ప్రముఖ సాక్షి ఫోటో గ్రాఫర్ ఏలేటి శైలేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు పిసిసి కార్యవర్గ సభ్యుడు శైలేందర్ రెడ్డి స్థానిక ఎంపిటిసి గాజుల మల్లేశం, ఏలేటి కృష్ణారెడ్డి, ఏలేటి సత్యనారాయణ,ఏలేటి అంజన్ రెడ్డి,వైద్య శిభిరం సిబ్బంది,ఏలేటి అభిమానులు  పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version